కారు దిగిన దీదీ… బీజేపీ కార్యకర్తల పరుగో పరుగు…
వెస్ట్ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి ఊహించని అనుభవం ఎదురైంది. వెస్ట్ మిడ్నాపూర్లో కొంతమంది యువకులు ఆమెను చూసి.. జై శ్రీరాం అంటూ నినాదాలు చేశారు. దీంతో ఆమె తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. శనివారం మధ్యాహ్నం ఓ బహిరంగ సభలో ప్రసంగించేందుకు చంద్రకొండ వెళ్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. బీజేపీ జెండాలు పట్టుకుని రోడ్డుకిరువైపులా నిలబడిన కొందరు గ్రామస్తులు మమత కాన్వాయ్ని చూడగానే జై శ్రీరాం అంటూ నినాదాలు చేశారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన మమత […]
వెస్ట్ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి ఊహించని అనుభవం ఎదురైంది. వెస్ట్ మిడ్నాపూర్లో కొంతమంది యువకులు ఆమెను చూసి.. జై శ్రీరాం అంటూ నినాదాలు చేశారు. దీంతో ఆమె తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. శనివారం మధ్యాహ్నం ఓ బహిరంగ సభలో ప్రసంగించేందుకు చంద్రకొండ వెళ్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. బీజేపీ జెండాలు పట్టుకుని రోడ్డుకిరువైపులా నిలబడిన కొందరు గ్రామస్తులు మమత కాన్వాయ్ని చూడగానే జై శ్రీరాం అంటూ నినాదాలు చేశారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన మమత వెంటనే తన డ్రైవర్ను కారు ఆపమని చెప్పి ఒక్కసారిగా డోర్ తీసి కిందికి దిగారు. ఆమె వేగంగా దిగడాన్ని చూసిన బీజేపీ కార్యకర్తలు పరుగులు తీశారు. ఎందుకు పారిపోతున్నారని మమత అడిగినా వారు ఆగలేదు. ఇలా రండని పిలిచినా దగ్గరకు రాలేదు. వీళ్లంతా చాలా తెలివైనవారని, తన నుంచి తప్పించుకున్నారని ఆమె వ్యాఖ్యానించారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిన ఆమె ఓ సభలో మాట్లాడుతూ, ఇక్కడ నినాదాలు చేస్తున్న వాళ్ల నోళ్లు మే 23 తరువాత మూతపడతాయని అన్నారు. ఎన్నికలు ముగిసిన తరువాత వారంతా ఇక్కడే ఉండాల్సి వస్తుందని అన్నారు. ఇక ఈ ఘటనపై స్పందించిన బీజేపీ, జై శ్రీరామ్ నినాదాలు వింటే మమతకు కోపమెందుకని, అదేదో వినకూడని మాటలు విన్నట్టుగా ఎందుకు ప్రవర్తిస్తున్నారని ప్రశ్నించింది.
Today’s latest news, chief minister of West Bengal very angry for say “jai sriram”. when her convoy cross radhaballavpur of chandrakona town some young person souting by “jai srimam” for this reason she was very angry like fire. Think which state we are living? pic.twitter.com/FZ64c9LHs0
— Tapan Raval (@_TapanRaval) May 4, 2019