తెలంగాణకి నూతన గవర్నర్..? నరసింహన్ వ్యాఖ్యలు సంకేతాలా..?
గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రానికి కొత్త గవర్నర్ వస్తారంటూ వార్తలు వస్తున్నాయి. పదేళ్ల పాటు తెలుగు ప్రజలకు గవర్నర్గా వ్యవహరించిన ప్రస్తుత తెలంగాణ గవర్నర్ నరసింహన్ను కేంద్రం మరో ప్రాంతానికి బదిలీ చేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు నరసింహన్ మాత్రం ఈ అంశంపై ఎప్పుడూ పెద్దగా స్పందించలేదు. అయితే ఇటీవలే కేంద్రం ఏపీకి హరిచందన్ బిశ్వభూషణ్ను ప్రత్యేక గవర్నర్గా నియమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నరసింహన్ తెలంగాణకు పరిమితయ్యారు. అయితే ఆయన్ను […]
గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రానికి కొత్త గవర్నర్ వస్తారంటూ వార్తలు వస్తున్నాయి. పదేళ్ల పాటు తెలుగు ప్రజలకు గవర్నర్గా వ్యవహరించిన ప్రస్తుత తెలంగాణ గవర్నర్ నరసింహన్ను కేంద్రం మరో ప్రాంతానికి బదిలీ చేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు నరసింహన్ మాత్రం ఈ అంశంపై ఎప్పుడూ పెద్దగా స్పందించలేదు. అయితే ఇటీవలే కేంద్రం ఏపీకి హరిచందన్ బిశ్వభూషణ్ను ప్రత్యేక గవర్నర్గా నియమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నరసింహన్ తెలంగాణకు పరిమితయ్యారు. అయితే ఆయన్ను ఇక వేరే ప్రాంతానికి బదిలీ చేస్తారన్న వార్తలు వస్తున్నాయి. తాజాగా మొన్న రాజ్భవన్లో జరిగిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు సన్మాన కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు మార్పు సంకేతాలను వెల్లడించినట్లు తెలుస్తోంది .
తాను గవర్నర్గా ఉన్నా లేకున్నా 2020 ఒలంపిక్స్లో బంగారు పతకం సాధించి.. మరోసారి రాజ్ భవన్లో అడుగుపెట్టాలంటూ గవర్నర్ నరసింహన్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. గవర్నర్ ఏదో సరదాగా ఈ మాట అన్నారా ? లేక తన బదిలీపై ఆయనకు స్పష్టమైన సమాచారం ఉందా ? అనే అంశం ఆసక్తికరంగా మారింది. అయితే ఆర్టికల్ 370 రద్దు అనంతరం.. జమ్మూ కాశ్మీర్ను విభజించిన కేంద్రం.. లడఖ్ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చిన విషయం తెలిసిందే. ఈ లఢఖ్కు నరసింహన్ను లెఫ్ట్నెంట్ గవర్నర్గా నియమించే యోచనలో ఉన్నట్టు కూడా వార్తలు వచ్చాయి. మొత్తానికి తెలంగాణ గవర్నర్గా ఉన్న నరసింహన్ చేసిన వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏమిటన్నది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.