స్లీపింగ్ మోడ్‌లో తెలంగాణ కాంగ్రెస్‌.. ఎవరెక్కడో తెలుసా ?

తెలంగాణ కాంగ్రెస్ హెడ్ క్వార్టర్ అయిన గాంధీభవన్‌లో నిశ్శబ్ధం రాజ్యమేలుతోంది. నాయకుడు లేడు. ఆయన రెస్ట్‌మోడ్‌లో ఉన్నారు. దాంతో గాంధీభవన్‌ సైలెంట్‌ మోడ్‌లోకి వెళ్లిపోయింది. కీలక నేతలు అమెరికా బాటపట్టారు. ఉన్న నేతలు సమావేశాలకు పరిమితమయ్యారు. దీంతో చలో ట్యాంక్‌బండ్‌లో కాంగ్రెస్‌ నేతలు కనిపించకుండా పోయారు. అసలు కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది? కాయకల్ప చికిత్సకు అధిష్టానం ఎందుకు వెనక్కి తగ్గుతోంది ? పరిశీలిస్తే ఆసక్తికర అంశాలు తెరమీదికొచ్చాయి. ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా సకలజనుల చలో ట్యాంక్‌బండ్‌ చేపట్టారు. […]

స్లీపింగ్ మోడ్‌లో తెలంగాణ కాంగ్రెస్‌.. ఎవరెక్కడో తెలుసా ?
Follow us

|

Updated on: Nov 11, 2019 | 7:47 PM

తెలంగాణ కాంగ్రెస్ హెడ్ క్వార్టర్ అయిన గాంధీభవన్‌లో నిశ్శబ్ధం రాజ్యమేలుతోంది. నాయకుడు లేడు. ఆయన రెస్ట్‌మోడ్‌లో ఉన్నారు. దాంతో గాంధీభవన్‌ సైలెంట్‌ మోడ్‌లోకి వెళ్లిపోయింది. కీలక నేతలు అమెరికా బాటపట్టారు. ఉన్న నేతలు సమావేశాలకు పరిమితమయ్యారు. దీంతో చలో ట్యాంక్‌బండ్‌లో కాంగ్రెస్‌ నేతలు కనిపించకుండా పోయారు. అసలు కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది? కాయకల్ప చికిత్సకు అధిష్టానం ఎందుకు వెనక్కి తగ్గుతోంది ? పరిశీలిస్తే ఆసక్తికర అంశాలు తెరమీదికొచ్చాయి.

ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా సకలజనుల చలో ట్యాంక్‌బండ్‌ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రతిపక్షానికి చెందిన అన్ని పార్టీల నేతలు పాల్గొన్నారు. ట్యాంక్‌ బ్యాండ్‌ పరిసర ప్రాంతాలు ఉద్రిక్తంగా మారాయి. కానీ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కీలక నేతలు మాత్రం ఆ పరిసర ప్రాంతాల్లో కనిపించలేదు. కాంగ్రెస్‌ నేతలు సైలెంట్‌ ఎందుకు అయ్యారు? కొందరైతే ఆర్టీసీ సమ్మె మీద ఎంతో కొంత హడావిడి చేసి.. అనాల్సిన నాలుగు మాటలు అనేసి.. చక్కగా అమెరికాకు చెక్కేశారని అనుకుంటున్నారు.

చలో ట్యాంక్‌బండ్‌ కార్యక్రమంలో జగ్గారెడ్డితో పాటు విక్రమ్‌గౌడ్‌తో పాటు కొందరు నేతలు మాత్రమే పాల్గొన్నారు. పోలీసులు వీరిని అరెస్టు కూడా చేశారు. కానీ ఇతర కీలక నేతలు మాత్రం ఎవరూ కనీసం ట్యాంక్‌బండ్‌ వైపు కన్నెత్తి చూడలేదు. కొందరు హౌస్‌ అరెస్టులకు మాత్రమే పరిమితమయ్యారు. ఒకరిద్దరైతే పోలీసులను రప్పించుకుని మరీ హౌజ్ అరెస్ట్ పేరిట తాపీగా వుండిపోయారని గాంధీభవన్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఆర్టీసీ సమ్మె ప్రారంభం నుంచి కాంగ్రెస్‌ నేతలు దూరంగానే ఉంటున్నారు. వీరు ఎందుకు బయటకు రావడం లేదనేది ఇప్పుడు గాంధీభవన్‌లో డిస్కషన్‌ పాయింట్‌ అయింది.

కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై నిరసనకు పిలుపు ఇస్తే కాంగ్రెస్‌ నేతలు మొత్తం కదులుతున్నారు. ధర్నాలతో హోరెత్తిస్తున్నారు. అదే రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలపై ఆందోళనకు పిలుపు ఇస్తే నేతలు గాంధీభవన్‌ దాటి రావడం లేదని తెలుస్తోంది. కేసీఆర్‌తో మిలాఖత్‌ రాజకీయంతోనే తమ నేతలు నిరసనల్లో పాల్గొనడం లేదని కొందరు గాంధీభవన్‌ నేతలు విమర్శిస్తున్నారు. మొత్తానికి కాంగ్రెస్‌ నేతలు సైలెంట్‌ మోడ్‌ నుంచి ఎప్పుడూ బయటకు వస్తారో..ఎప్పుడూ సమరం ప్రకటిస్తారో అని కార్యకర్తలు వెయిటింగ్‌ చేస్తున్నారు.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..