Andhra Pradesh: డిప్యూటీ సీఎం చిత్రపటానికి మద్యంతో అభిషేకం.. టీడీపీ వినూత్న నిరసన
ఏపీలో అధికార, ప్రతిపక్షాల మధ్య కల్తీ సారా వార్ కొనసాగుతుంది. రాష్ట్రంలో కల్తీ సారా, జే బ్రాండ్ మద్యం తాగి ప్రజలు చనిపోతున్నారని టీడీపీ ఆరోపిస్తుంది.
ఏపీలో అధికార, ప్రతిపక్షాల మధ్య కల్తీ సారా వార్ కొనసాగుతుంది. రాష్ట్రంలో కల్తీ సారా, జే బ్రాండ్ మద్యం తాగి ప్రజలు చనిపోతున్నారని టీడీపీ(Tdp) ఆరోపిస్తుంది. అటు అసెంబ్లీలో ఈ విషయంపై చర్చకు పట్టుబడుతుంది. ఈ నాటుసారా రచ్చ రాష్ట్రంలో డైలీ సీరియల్గా మారింది. కల్తీసారాపై టీడీపీ ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి. ఇవాళ ఎక్సైజ్ ఆఫీసు ముట్టడికి పిలుపునిచ్చింది టీడీపీ. టీడీపీ పిలుపుతో అప్రమత్తమయ్యారు పోలీసులు. టీడీపీ ఎమ్మెల్యేలను హౌస్ అరెస్ట్ చేశారు. సస్పెండయిన 11 మంది ఎమ్మెల్యేల ఇళ్ల దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్సైజ్ ఆఫీసు దగ్గరకు రానీయకుండా చర్యలు తీసుకుంటున్నారు. విజయవాడ(Vijayawada)లో దేవినేని ఉమ(Devineni Uma), బోండా ఉమా, గద్దె రామ్మోహన్, అచ్చెన్న, బొడే ప్రసాద్, వర్ల రామయ్యలను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. మరోవైపు.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని సైతం హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. టీడీపీ కార్యాలయానికి బయల్దేరిన అచ్చెన్నను ఇల్లు కదలకుండా బందోబస్తు మోహరించారు.
ఇదిలా ఉండగా.. కల్తీ సారాపై చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో టీడీపీ కార్యకర్తలు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి తీరుపై తెలుగు తమ్ముళ్లు మండిపడ్డారు. దేవాలయం లాంటి అసెంబ్లీలో మాజీ సీఎం చంద్రబాబుపై బూతును ప్రయోగించడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు.మంత్రి పదవి ఊడిపోతుందని మతి భ్రమించి నారాయణ స్వామి మాట్లాడుతున్నారని కార్యకర్తలు మండిపడ్డారు. పుత్తూరు జాతీయ రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి చిత్రపటానికి మద్యంతో అభిషేకం చేశారు.
Also Read: Vizag: విశాఖ జాలర్లకు చిక్కిన విచిత్ర చేప.. దీని ప్రత్యేకతలేంటో తెలుసా..?