అరవింద్ కేజ్రీవాల్కు రెండో దెబ్బ
ఆప్ లో మరో వికెట్ పడింది. ఆమ్ ఆద్మీ పార్టీ రెబల్ ఎమ్మెల్యే దేవిందర్ కుమార్ షెరావత్ కమలం గూటికి చేరారు.ఆయనకు కేంద్రమంత్రి విజయ్గోయల్ బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మే 3న ఆప్ ఎమ్మెల్యే అనిల్ బాజ్పేయ్ ఢిల్లీ బీజేపీ ఇన్ఛార్జ్ శ్యాంజాజు, గోయల్ సమక్షంలో ఇప్పటికే బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. బీజేపీ రూ.10 కోట్ల చొప్పున ఆఫర్ ప్రకటించి..తమ ఎమ్మెల్యేలను బలవంతంగా పార్టీలోకి తీసుకుంటుందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియో […]
ఆప్ లో మరో వికెట్ పడింది. ఆమ్ ఆద్మీ పార్టీ రెబల్ ఎమ్మెల్యే దేవిందర్ కుమార్ షెరావత్ కమలం గూటికి చేరారు.ఆయనకు కేంద్రమంత్రి విజయ్గోయల్ బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మే 3న ఆప్ ఎమ్మెల్యే అనిల్ బాజ్పేయ్ ఢిల్లీ బీజేపీ ఇన్ఛార్జ్ శ్యాంజాజు, గోయల్ సమక్షంలో ఇప్పటికే బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. బీజేపీ రూ.10 కోట్ల చొప్పున ఆఫర్ ప్రకటించి..తమ ఎమ్మెల్యేలను బలవంతంగా పార్టీలోకి తీసుకుంటుందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియో ఇప్పటికే ఆరోపణలు చేశారు. కాగా, గత శుక్రవారం రోజే కేజ్రీవాల్ తన ఎమ్మెల్యేలను కొనలేరని.. ఎవరూ కూడా పార్టీని వీడరని స్పష్టం చేశారు. అలా ప్రకటించిన 24గంటలు గడవకముందే కేజ్రీవాల్కి బాజ్పేయ్ షాక్ ఇచ్చారు. ఇప్పుడు దేవిందర్ షెరావత్ కూడా పార్టీ మారడం ఆప్కు కోలుకోలేని దెబ్బ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.