వైసీపీ అభ్యర్థి ఆమంచిపై కేసు నమోదు

చీరాల: ప్రకాశం జిల్లా చీరాల వైసీపీ అభ్యర్థి ఆమంచి కృష్ణ మోహన్‌పై కేసు నమోదైంది. చీరాలలో ఎన్నికల నిబంధనలు ఉల్లంగించి సమావేశం ఏర్పాటు చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు.  ఆమంచి తమ విధులకు ఆటంకం కలిగించారని పేర్కొంటూ చీరాల రూరల్‌ సీఐ కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై ఆమంచి స్పందిస్తూ.. బూత్‌ కమిటీలతో సమావేశం ఏర్పాటు చేశానని, పోలీసులు అనవసరంగా తనపై కేసు నమోదు చేశారని చెప్పారు. పోలీసుల తీరుపై ఈసీకి ఫిర్యాదు చేయనున్నట్టు […]

వైసీపీ అభ్యర్థి ఆమంచిపై కేసు నమోదు
Follow us

|

Updated on: Apr 09, 2019 | 9:00 PM

చీరాల: ప్రకాశం జిల్లా చీరాల వైసీపీ అభ్యర్థి ఆమంచి కృష్ణ మోహన్‌పై కేసు నమోదైంది. చీరాలలో ఎన్నికల నిబంధనలు ఉల్లంగించి సమావేశం ఏర్పాటు చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు.  ఆమంచి తమ విధులకు ఆటంకం కలిగించారని పేర్కొంటూ చీరాల రూరల్‌ సీఐ కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై ఆమంచి స్పందిస్తూ.. బూత్‌ కమిటీలతో సమావేశం ఏర్పాటు చేశానని, పోలీసులు అనవసరంగా తనపై కేసు నమోదు చేశారని చెప్పారు. పోలీసుల తీరుపై ఈసీకి ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు.