కశ్మీర్ వెళ్తారా.. ఆ మాత్రం ఓపిక లేదా..?

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై బీఎస్పీ అధినేత్రి మాయావతి మరోసారి మండిపడ్డారు. శనివారం విపక్ష సభ్యులు బృందంతో ఆయన చేపట్టిన కశ్మీర్ టూర్‌పై ట్వీట్ చేశారు. రాహుల్ చేసిన జమ్ముకశ్మీర్ టూర్‌ను మాయావతి తప్పుపట్టారు. కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు వచ్చే వరకు ఓపిక పట్టాలని.. ఎలాంటి అనుమతి లేకుండా విపక్షాలతో కలిసి వెళ్లాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. అక్కడికి వెళ్లేటప్పుడు మంచి, చెడులు ఆలోచించుకోవాలి కదా అని అన్నారు. ఆర్టికల్ 370 రద్దు, కశ్మీర్ విభజన అంశాలపై […]

కశ్మీర్ వెళ్తారా.. ఆ మాత్రం ఓపిక లేదా..?
Follow us

| Edited By:

Updated on: Aug 26, 2019 | 4:55 PM

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై బీఎస్పీ అధినేత్రి మాయావతి మరోసారి మండిపడ్డారు. శనివారం విపక్ష సభ్యులు బృందంతో ఆయన చేపట్టిన కశ్మీర్ టూర్‌పై ట్వీట్ చేశారు. రాహుల్ చేసిన జమ్ముకశ్మీర్ టూర్‌ను మాయావతి తప్పుపట్టారు. కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు వచ్చే వరకు ఓపిక పట్టాలని.. ఎలాంటి అనుమతి లేకుండా విపక్షాలతో కలిసి వెళ్లాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. అక్కడికి వెళ్లేటప్పుడు మంచి, చెడులు ఆలోచించుకోవాలి కదా అని అన్నారు. ఆర్టికల్ 370 రద్దు, కశ్మీర్ విభజన అంశాలపై మరోసారి కేంద్రాన్ని సమర్థించిన ఆమె.. పరిస్థితులను చక్కదిద్దేందుకు.. పాలన సజావుగా సాగేందుకు అక్కడి గవర్నర్‌కు మరింత సమయం ఇవ్వాలన్నారు.