Political War: TRS రియాక్షన్ ఏంటి.. BJP నేతల వాదన ఏంటి.. మరింత హీట్ పెంచుతున్న రాజకీయం
మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అరెస్ట్ తప్పదా ? ఇప్పుడు టిఆర్ఎస్ రియాక్షన్ ఏంటి ? బీజేపీ నేతల వాదన ఏంటి ? జాతీయ ఎస్సీ కమిషన్ ఆదేశాలతో మల్కాజ్గిరిలో రాజకీయం మరింత వేడెక్కింది.
మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అరెస్ట్ తప్పదా ? ఇప్పుడు టిఆర్ఎస్ రియాక్షన్ ఏంటి ? బీజేపీ నేతల వాదన ఏంటి ? జాతీయ ఎస్సీ కమిషన్ ఆదేశాలతో మల్కాజ్గిరిలో రాజకీయం మరింత వేడెక్కింది. అసలు ఇండిపెండెన్స్ డే రోజు మల్కాజ్గిరిలో ఏం జరిగింది ? దళిత మహిళను దూషించిన ఘటనలో సీరియస్ అయింది జాతీయ ఎస్సీ కమిషన్. ఈ ఘటనలో 24 గంటల్లో యాక్షన్ తీసుకోకుంటే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు నేషనల్ ఎస్సీ కమిషన్ వైస్ చైర్పర్సన్ అరుణ్హాల్దార్. కూకట్పల్లిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు అరుణ్ హాల్దార్.
ఇండిపెండెన్స్ డే రోజు మల్కాజ్గిరిలో జరిగిన ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. బీజేపీ కార్పొరేటర్ శ్రావణ్పై దాడి ఘటన సహా దళిత మహిళలను తీవ్ర పదజాలంతో దూషించారని మైనంపల్లి, అనుచరులపై కేసులు నమోదయ్యాయి. స్వాతంత్ర్య దినోత్సవం రోజున దళితులను కులం పేరుతో దూషించారని దళిత సంఘాలు జాతీయ ఎస్సీ కమిషన్కి ఫిర్యాదు చేశాయి.
దళిత సంఘాలు ఇచ్చిన ఫిర్యాదుపై జాతీయ ఎస్సీ కమిషన్ వెంటనే స్పందించింది. కమిషన్ వైస్ చైర్మన్ అరుణ్ హల్దర్ నిన్న హైదరాబాద్ వచ్చి నేరుగా బాధితులను కలిసి విచారణ చేపట్టారు. బాధిత మహిళలను అడిగి వివరాలు సేకరించారు. ఆ తర్వాత ఎమ్మెల్యే మైనంపల్లిని అరెస్టు చేయాలని ఆదేశించారు. 24 గంటల్లో ఎమ్మెల్యే, ఆయన అనుచరులపై చర్యలు తీసుకోవాలని.. లేకుంటే సంబంధిత అధికారులపై కూడా చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు.
ఇండిపెండెన్స్ డే రోజు మల్కాజ్గిరిలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ దాడి ఘటనపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తీరుపై మండిపడ్డారు. అటు బండి సంజయ్పై అంతేస్థాయిలో స్పందించారు మైనంపల్లి. దీంతో వీరి మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది.
ఇవి కూడా చదవండి: Success Story: మేడపై మల్లె పూల సాగు.. లక్షల్లో సంపాదన.. లాక్డౌన్ సమయంలో ఓ మహిళ విజయ గాథ..
Women Should be Careful: మీ పక్కనే మృగాళ్లుంటారు.. మహిళలు బీ కేర్ ఫుల్.. సో.. బీ అలర్ట్ లేడీస్..