ఎన్డీయేతో జేడీయూ రాంరాం..? బీహార్కే పరిమితం
బీజేపీతో తమకున్న స్నేహంపై జేడీయూ స్పష్టతనిచ్చింది. బీహార్లో తప్ప మరెక్కడా ఎన్డీయేతో తాము భాగస్వామ్యం కాదని ఆ రాష్ట్ర సీఎం నితీష్కుమార్ స్పష్టం చేశారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న జమ్ముకశ్మీర్, జార్ఖండ్, హర్యానా, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని క్లారిటీ ఇచ్చారు. మోదీ కేబినెట్లో తమ పార్టీకి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై నితీష్కుమార్ గుర్రుగా ఉన్నారు. ఒక్కరికే మంత్రి వర్గంలో చోటు కల్పించడంపై తీవ్ర అసహనంలో ఉన్న జేడీయూ.. ఎన్డీఏ […]
బీజేపీతో తమకున్న స్నేహంపై జేడీయూ స్పష్టతనిచ్చింది. బీహార్లో తప్ప మరెక్కడా ఎన్డీయేతో తాము భాగస్వామ్యం కాదని ఆ రాష్ట్ర సీఎం నితీష్కుమార్ స్పష్టం చేశారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న జమ్ముకశ్మీర్, జార్ఖండ్, హర్యానా, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని క్లారిటీ ఇచ్చారు.
మోదీ కేబినెట్లో తమ పార్టీకి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై నితీష్కుమార్ గుర్రుగా ఉన్నారు. ఒక్కరికే మంత్రి వర్గంలో చోటు కల్పించడంపై తీవ్ర అసహనంలో ఉన్న జేడీయూ.. ఎన్డీఏ నుంచి బయటకు వస్తుందన్న ప్రచారం జోరుగా సాగింది. ఈ నేపథ్యంలో బీజేపీతో ఉన్న స్నేహంపై నితీష్ కుమార్ స్పష్టతనిచ్చారు.