దేశంలో దుష్టులంతా ఏకం అయ్యారు: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌పై ముగ్గురు దుష్టులు కలిసి దాడులు చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు ఏపీ సీఎం చంద్రబాబు… టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలో దుర్మార్గులంతా ఏకం అయ్యారు. ప్రత్యర్ధులపై కక్ష సాధింపే లక్ష్యంగా పనిచేస్తున్నారు.. ఒకవైపు మోడీ, మరోవైపు కేసీఆర్, ఇంకోవైపు జగన్.. ఇలా ముగ్గురు దుష్టులూ ఆంధ్రప్రదేశ్ పై ముప్పేట దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. కేంద్రం నుంచి మోడీ డైరెక్షన్‌తోనే టీడీపీ నేతలపై ఐటీ దాడులు జరిగాయి […]

దేశంలో దుష్టులంతా ఏకం అయ్యారు: చంద్రబాబు
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Apr 04, 2019 | 7:21 PM

ఆంధ్రప్రదేశ్‌పై ముగ్గురు దుష్టులు కలిసి దాడులు చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు ఏపీ సీఎం చంద్రబాబు… టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలో దుర్మార్గులంతా ఏకం అయ్యారు. ప్రత్యర్ధులపై కక్ష సాధింపే లక్ష్యంగా పనిచేస్తున్నారు.. ఒకవైపు మోడీ, మరోవైపు కేసీఆర్, ఇంకోవైపు జగన్.. ఇలా ముగ్గురు దుష్టులూ ఆంధ్రప్రదేశ్ పై ముప్పేట దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు.

కేంద్రం నుంచి మోడీ డైరెక్షన్‌తోనే టీడీపీ నేతలపై ఐటీ దాడులు జరిగాయి అని ఆరోపించిన చంద్రబాబు… టీడీపీ నేతలపై పాత కేసులను కేసీఆర్ తవ్వుతున్నారని విమర్శించారు. ఇక పుంగనూరులో బెదిరింపులు, మైలవరంలో వైసీపీ శ్రేణుల‌ రణరంగం, పొన్నూరులో స్కూల్ పిల్లల ఆటోపై వైసీపీ నేతల దౌర్జన్యం లాంటి పరిస్థితులు నెలకొన్నాయని ఆరోపించారు.  వైసీపీకి ఓటేస్తే మన ఇళ్లలో మనమే అద్దెకు ఉండాల్సి వస్తుందన్నారు. ప్రచారానికి ఇంకా ఐదు రోజులే ఉంది.. పోలింగ్‍కు గడువు 6 రోజులే ఉంది.. ప్రతీ క్షణం ప్రజాభిమానం పొందేందుకే సద్వినియోగం చేసుకోవాలని కార్యకర్తలకు చంద్రబాబు సూచించారు.