టీఆర్ఎస్కు ప్రతిష్ఠాత్మకంగా మారిన హుజుర్నగర్ ఉప ఎన్నిక!
తెలంగాణ రాజకీయాలు ఇప్పటికే హాట్హాట్గా మారాయి. ఒకవైపు బడ్జెట్ విషయంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ల మధ్య వాడీ, వేడీ చర్చ జరుగుతోంది. ఇక క్యాబినెట్లో చోటు దక్కించుకోలేకపోయిన అసంతృప్త నేతలను తమవైపు గుంజుకునేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. ఇక యురేనియం తవ్వకాలపై చెలరేగిన ఆందోళలను అసెంబ్లీలో ప్రకటన చేసి సీఎం కేసీఆర్ సర్దుమణిగేలా చేశారు. కాగా ఇప్పుడు హుజుర్ నగర్ ఉప ఎన్నిక అందరి దృష్టి మళ్లింది. కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని ప్రకటించి దూకుడు మీద ఉండగా.. […]
తెలంగాణ రాజకీయాలు ఇప్పటికే హాట్హాట్గా మారాయి. ఒకవైపు బడ్జెట్ విషయంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ల మధ్య వాడీ, వేడీ చర్చ జరుగుతోంది. ఇక క్యాబినెట్లో చోటు దక్కించుకోలేకపోయిన అసంతృప్త నేతలను తమవైపు గుంజుకునేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. ఇక యురేనియం తవ్వకాలపై చెలరేగిన ఆందోళలను అసెంబ్లీలో ప్రకటన చేసి సీఎం కేసీఆర్ సర్దుమణిగేలా చేశారు.
కాగా ఇప్పుడు హుజుర్ నగర్ ఉప ఎన్నిక అందరి దృష్టి మళ్లింది. కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని ప్రకటించి దూకుడు మీద ఉండగా.. టీఆర్ఎస్ ఆచితూచి వ్యవహరిస్తోంది. సీఎం కేసీఆర్ అక్కడి నుంచి ఎవర్నీ బరిలోకి దించబోతున్నారన్న దానిపై అందరికి ఆసక్తి నెలకుంది. కూతురు కవితకు సీఎం బీఫాం ఇవ్వనున్నారన్న టాక్ జోరందుకుంది.
తెలంగాణలో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో హుజుర్ నగర్ స్థానం నుంచి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అదే క్రమంలో ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అటు నల్గొండ ఎంపీగా కూడా విజయం సాధించారు. దాంతో ఎంపీగా కొనసాగడానికి సిద్ధమైన ఉత్తమ్.. హుజుర్ నగర్ ఎమ్మెల్యేగా రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో అక్కడ ఎన్నిక అనివార్యమైంది. ఆ క్రమంలో అక్కడ నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతిని కాంగ్రెస్ కన్ఫార్మ్ చేసింది.
సూర్యాపేట జిల్లా చింతలపాలెంలో మండలంలోని నక్కగూడెంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన వెల్లడించారు. ఉమ్మడి మేళ్ళచెర్వు మండలానికి మంత్రిగా, ఎమ్మెల్యేగా ఎంత కృషి చేశానో అందరికీ తెలుసునన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా కాంగ్రెస్ గెలుపు కోసం కృషికి ప్రయత్నింనట్లు వెల్లడించారు. టీఆర్ఎస్ గలీజు రాజకీయాలు చేస్తోందని అంటూ నిప్పులు చెరిగారు. ఆ పార్టీ రెండుసార్లు అధికారంలోకి వచ్చి రాష్ట్ర ప్రజలకు ఏ పని చేశారో చెప్పాలంటూ కార్యకర్తలను అడిగారు. పిల్లలు లేరు, ఆస్తులు అవసరం లేవు, నియోజకవర్గ ప్రజలే తమ బిడ్డలని అన్నారు. కుళ్లు రాజకీయాలు తనకు తెలియదని, ఉపఎన్నికలలో కాంగ్రెస్కు పట్టేంకట్టేలా పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. ఎంపీగా ఉన్న హుజుర్నగర్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ముందు వరుసలో ఉండేలా కృషి చేస్తానని హమీ ఇచ్చారు. కోదాడ, హుజుర్నగర్ ప్రజలకు తను రుణపడి ఉంటానని, పద్మావతిని ఉపఎన్నికల బరిలో నిలుపనున్నట్లు పేర్కొన్నారు. ఆ దిశగానే కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చి అధికార టీఆర్ఎస్కు సవాల్ విసిరారు ఉత్తమ్.
ముందుగానే అభ్యర్తిని తాము జోష్లో ఉన్నామని సంకేతాలు పంపింది కాంగ్రెస్. అయితే అధికార పక్షమైన టీఆర్ఎస్ పార్టీ ఇంతవరకు అభ్యర్థిని డిసైడ్ చేయలేదు. అటు బీజేపీ కూడా తమ క్యాండిడేట్ను ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ కూతురు, నిజామబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత టీఆర్ఎస్ తరుఫున బరిలోకి నిలుస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. టీఆర్ఎస్కు ఇప్పుడు ఆ సీటు ప్రస్టేజ్గా మారింది. పార్లమెంట్ ఎన్నికల్లో అనుకున్నస్థాయిలో ఫలితాలు రాకపోవడం..సొంత కూతురు కవిత ఓడిపోవడంతో సీఎం కేసీఆర్ డిఫెన్స్లో పడ్డారు. అధికారంలో ఉండి హుజుర్ నగర్ స్థానం గెలుచుకోకపోతే ప్రజల్లోకి నెగటీవ్ సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉంది. అందుకే కాంగ్రెస్కు కంచుకోట అందులోనూ..పిసీసీ చీఫ్ స్థానంలో తన కుమార్తెను గెలిపించి సత్తా చాటాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారట. అందుకు తగ్గట్లుగా వ్యూహాలు రచిస్తున్నారు. మరోవైపు ఓడిపోతే కూడా ఆయన భారీగానే మూల్యం చెల్లుంచుకోవాల్సి ఉంటోంది. అందుకే అభ్యర్థి ప్రకటన విషయంలో తీవ్రంగా మల్లగుల్లాలు పడుతున్నారు. మరి సీఎం కేసీఆర్ ఎముందో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.