జగన్ పాలన బావుంది: టీడీపీ మాజీ ఎంపీ..!
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన తీరు బావుందని మాజీ టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు అన్నారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రస్తుతం జగన్ పాలన పై స్పందించారు. నవరత్నాల పథకం చాలా మంచి కార్యక్రమమని అన్నారు. కేంద్రం సహకరిస్తే ఏపీ ప్రభుత్వం అభివృద్ధిలో మరింత ముందుకు వెళ్తుందని పేర్కొన్నారు. అలాగే.. నేను ఏ పార్టీలో చేరాలో ఇంకా నిర్ణయించుకోలేదని.. త్వరలోనే ప్రకటిస్తానని పేర్కొన్నారు. పోలవరం రివర్న్ టెండర్ వల్ల నిర్మాణ […]
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన తీరు బావుందని మాజీ టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు అన్నారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రస్తుతం జగన్ పాలన పై స్పందించారు. నవరత్నాల పథకం చాలా మంచి కార్యక్రమమని అన్నారు. కేంద్రం సహకరిస్తే ఏపీ ప్రభుత్వం అభివృద్ధిలో మరింత ముందుకు వెళ్తుందని పేర్కొన్నారు. అలాగే.. నేను ఏ పార్టీలో చేరాలో ఇంకా నిర్ణయించుకోలేదని.. త్వరలోనే ప్రకటిస్తానని పేర్కొన్నారు. పోలవరం రివర్న్ టెండర్ వల్ల నిర్మాణ వ్యయం మరింత పెరుగుతుందే కానీ.. తగ్గదని ప్రభుత్వానికి సూచించారు. కాగా.. ఉండవల్లి కరకట్ట వద్ద చంద్రబాబు నివాసంలో కృష్ణా నది రావడం మంచిదే వ్యాఖ్యానించారు టీడీపీ మాజీ ఎంపీ సాంబశివరావు.