కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాతే వారంతా సీఎంలు.. ముఖ్యమంత్రుల వారసులకు అక్కడ ఆదరణ కరవు.. ఇంట్రెస్టింగ్ అనాలిసిస్

రాజకీయాలు రంజుగా మారుతున్న తరుణంలో ఓ పరిశీలన ఆసక్తి రేపుతోంది. చర్చనీయాంశంగా మారుతోంది. కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి స్థితి ఎందుకొచ్చిందన్న ప్రశ్నను లేవనెత్తుతోంది.

కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాతే వారంతా సీఎంలు..  ముఖ్యమంత్రుల వారసులకు అక్కడ ఆదరణ కరవు.. ఇంట్రెస్టింగ్ అనాలిసిస్
Chandrababu, KCR, YS Jagan, Nadendla Bhaskara Rao, Marri sasidhar reddy, kotla suryaprakash reddy, Nedurumalli Ramkumar reddy, PV Vanidevi
Follow us

|

Updated on: Nov 24, 2022 | 6:16 PM

వారి తండ్రులు కాంగ్రెస్ పార్టీ ఆశీస్సులతో ముఖ్యమంత్రులయ్యారు. కానీ తనయులు, వారసులు మాత్రం ఆ పార్టీలో ఇమడలేకపోయారు. వీరిలో కొందరు కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాత తాము కోరుకున్న పదవులను పొందారు. ఇంకొందరు ఏకంగా ముఖ్యమంత్రులే అయ్యారు. రాజకీయాలు రంజుగా మారుతున్న తరుణంలో ఓ పరిశీలన ఆసక్తి రేపుతోంది. చర్చనీయాంశంగా మారుతోంది. కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి స్థితి ఎందుకొచ్చిందన్న ప్రశ్నను లేవనెత్తుతోంది. మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ డా. మర్రి చెన్నారెడ్డి తనయుడు మర్రి శశిధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడడంతోనే ఈ రకమైన చర్చ మొదలైందని చెప్పవచ్చు. చెన్నారెడ్డి కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాల పాటు కొనసాగారు. 80వ దశకంలో పార్టీని వీడి, సొంత కుంపటి పెట్టుకున్నప్పటికీ.. ఆ తర్వాత 1989 అసెంబ్లీ ఎన్నికలకు ముందు సొంతపార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. 1989లో మరోసారి సీఎం అయ్యారాయన. 1991 హైదరాబాద్ పాతబస్తీ అల్లర్ల నేపథ్యంలో చెన్నారెడ్డి సీఎం సీటును కోల్పోయారు. అయితే అప్పట్లో ప్రధాన మంత్రిగా, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షునిగా వున్న పీవీ నరసింహారావు.. చెన్నారెడ్డిని తమిళనాడు గవర్నర్‌గా పంపారు. ఆ తర్వాత ఆయన నాలుగు రాష్ట్రాలకు గవర్నర్‌గా కూడా పని చేశారు. ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాలకు చెన్నారెడ్డి గవర్నర్‌గా వ్యవహరించారు. కాంగ్రెస్ పార్టీలో అంతగా ఓ వెలుగు వెలిగిన చెన్నారెడ్డి వారసులు మాత్రం కాంగ్రెస్ పార్టీలో పెద్దగా పదవులేం పొందలేదనే చెప్పాలి. చెన్నారెడ్డి ఇద్దరు కుమారుల్లో మర్రి శశిధర్ రెడ్డి రాజకీయాల్లో కొనసాగుతున్నారు. చెన్నారెడ్డి పెద్ద కుమారుడు మర్రి రవీందర్ రెడ్డి కొంతకాలం యాక్టివ్ పాలిటిక్స్‌లో వున్నప్పటికీ పెద్దగా పదవులేం నిర్వహించలేదు. శశిధర్ రెడ్డి మాత్రం నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ ఎన్నోమార్లు మంత్రి పదవి ఆయనకు వచ్చినట్లే వచ్చి చేజారింది. తొలిసారి తన తండ్రి చెన్నారెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన సనత్ నగర్ నియోజకవర్గం నుంచి 1992 ఉప ఎన్నికలో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత 1994, 2004, 2009లలో మర్రి శశిధర్ రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2004లో కేంద్రంలో ఏర్పడిన యుపీఏ ప్రభుత్వం ఆయనకు జాతీయ పదవిని కట్టబెట్టింది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (NDMA)కి ఛైర్మెన్‌గా శశిధర్ రెడ్డిని నియమించారు. తాజాగా పార్టీలో తన ప్రాభవం కనుమరుగవుతుందని గ్రహించిన శశిధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడారు.

ముందు చెప్పుకోవాల్సింది వైఎస్ జగన్ గురించే

ఈకోవలో ముందుగా చెప్పుకోవాల్సింది దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబాన్నే. 1998లో రెండోసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడయ్యాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరుగులేని నేతగా ఎదిగారు. 2003లో చేపట్టిన పాదయాత్ర తర్వాత పార్టీలో సీఎం క్యాండిడేట్ అంటే రెండో పేరు వినిపించకుండా చేశారు. రెబల్ నేతగా అంతకు ముందున్న పేరును పూర్తిగా తొలగించుకున్నారు. 2004లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక పార్టీలో అసంతృప్తి వున్నా అసమ్మతి లేవకుండా పట్టుభిగించారు. పరిణామాలను ముందే ఊహించిన మాజీ మంత్రి మైసూరారెడ్డి లాంటి వారు ముందే బిచాణా సర్దుకుని తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోగా.. పార్టీలోనే వుండిపోయిన జేసీ దివాకర్ రెడ్డి, పి.జనార్ధన్ రెడ్డి లాంటి వారిని కట్టిపడేశారు. జేసీకి పెద్దగా ప్రాధాన్యతలేని శాఖను కేటాయిస్తూ మంత్రిపదవినిచ్చిన వైఎస్ఆర్.. పీజేఆర్‌ని మాత్రం పెద్దగా ఖాతరు చేయలేదు. ఈక్రమంలోనే పీజేఆర్.. 2007లో గుండెపోటుతో మరణించారు. 2009 అసెంబ్లీ ఎన్నికలు వచ్చేనాటికి వైఎస్ఆర్.. ఏపీ కాంగ్రెస్ పార్టీలో ఎదురే లేని నేతగా మారారు. ఆయన చెప్పిందే వేదం అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. 2009లో టీడీపీ, టీఆర్ఎస్ వంటి పార్టీలన్నీ ఒకవైపు మహాకూటమిగా నిలవగా.. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఒకవైపు అన్న పరిస్థితిలో ఒంటిచేత్తో రెండోసారి పార్టీని గెలిపించారు. మరోమారు సీఎం సీటుపై కూర్చున్నారు. కానీ విధి వక్రించింది. రెండోసారి సీఎం అయిన మూడున్నర నెలలకే ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. వైఎస్ తర్వాత సీఎం ఎవరన్న ప్రశ్న అప్పటి వరకు కనీసం ఊహకు కూడా ఎవరికీ రాలేదు. కానీ ఆయన మరణం తర్వాత పరిణామాలు మారిపోయాయి. అప్పటి వరకు కాంగ్రెస్ అధిష్టానానికి అత్యంత సన్నిహితంగా వున్న వైఎస్ కుటుంబం ఒక్కసారిగా దూరమైంది. తండ్రి తర్వాత సీఎం కావాలనున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిమతాన్ని సోనియా తోసిపుచ్చడంతో పరిస్థితిలో మార్పు వచ్చేసింది. రోశయ్యను సీఎం చేసిన సోనియా.. అప్పటికే ఎంపీగా వున్న జగన్ మోహన్ రెడ్డి పట్ల అచీతూచీ వ్యవహరించారు. ఈక్రమంలోనే సొంత ఇమేజీని పెంచుకోవడంపై వ్యూహరచన చేసిన జగన్.. వైఎస్ఆర్ వారసునిగా ప్రజలు తననే గుర్తించేలా కార్యక్రమాలను రూపొందించుకున్నారు. అందులో భాగంగా వైఎస్ఆర్ మరణం తర్వాత గుండాగి మరణించిన వారి కుటుంబాల పరామర్శకు బయలుదేరారు. ఓదార్పు యాత్రగా దానికి నామకరణం చేసుకున్నారు. అయితే, ఓదార్పు యాత్రకు అనుమతి విషయంలో కాంగ్రెస్ పార్టీలో హైడ్రామానే నడిచింది. చివరికి జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడారు. సొంతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నారు. 2014 ఎన్నికలపై కన్నేశారు. వైఎస్ఆర్ సెంటిమెంటును కొనసాగిస్తూ 2014 ఎన్నికల్లో విజయం సాధించేందుకు యత్నించారు. ఓదార్పు యాత్రను ఉధృతంగా నిర్వహించారు. అదేసమయంలో వైఎస్ జగన్‌పై క్విడ్ ప్రో కో ఆరోపణలతో సీబీఐ, ఈడీ కేసులు నమోదయ్యాయి. జగన్ రాజకీయానికి ఇక ఎండ్ కార్డే అని అందరు అనుకున్నారు. కానీ అన్నీ అనుకున్నట్లు జరిగితే అది జీవితం ఎందుకవుతుంది ? 2013 జులైలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని తీర్మానం చేయడంతో ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో పెద్ద కుదుపునకు కారణమయ్యాయి.  2014లో మరోసారి విజయం సాధించే లక్ష్యంతో సోనియా తెలంగాణ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్ర విభజన చంద్రబాబుకు అనుకూలంగా మారడంతో సీఎం కావాలన్న జగన్ కలను వాయిదా వేసింది. అయితేనేం.. అయిదేళ్ళపాటు వివిధ ఆటుపోట్లను తట్టుకుని నిలబడ్డారు. దాదాపు ఏడాదిన్నరపాటు వైఎస్ జగన్ రిమాండ్ ఖైదీగా జైలు జీవితం కూడా గడిపారు. చివరికి 2019లో తాననుకున్న లక్ష్యాన్ని సాధించారు. ఏపీకి సీఎం అయ్యారు. తండ్రి కాంగ్రెస్ పార్టీ ఆశీస్సులతో సీఎం అయితే, కుమారుడు కాంగ్రెస్ వీడి, పట్టుబట్టి, పోరాడి ముఖ్యమంత్రి అయ్యారు.

జగన్ కంటే ముందు.. ఆ తర్వాత

1971 జైఆంధ్ర ఉద్యమం తర్వాత కీలక సమయంలో ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన జలగం వెంగళరావు తనయుడు జలగం వెంకట్ రావు కూడా కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన వెంకట్ రావు.. కాంగ్రెస్ పార్టీని వీడి, టీఆర్ఎస్ పార్టీలో చేరి ఎమ్మెల్యే అయ్యారు. ఉమ్మడి ఏపీలో దిగ్గజ నేతగా పేరుగాంచిన కోట్ల విజయభాస్కర రెడ్డి తనయుడు కోట్ల సూర్యప్రకాశ్ రావు కూడా చిరకాల అనుబంధాన్ని వదులుకుని కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు. ఆయన తన సతీమణి కోట్ల విజయమ్మతో కలిసి తెలుగుదేశంపార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో అపర ఛాణక్యునిగా పేరుగాంచిన అయిదేళ్ళపాటు మైనారిటీ ప్రభుత్వ సారథిగా దేశాన్ని ఏలిన తెలంగాణతేజం పీవీ నరసింహారావు వారసురాలు వాణీదేవి కూడా కాంగ్రెస్ పార్టీని వీడి, తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరి ఎమ్మెల్సీ అయ్యారు. పీవీ నరసింహారావు 1969 తెలంగాణ ఉద్యమం తర్వాత ఉమ్మడి ఏపీ సీఎంగా కొంతకాలం కొనసాగారు. ఆయన తనయులు రాజేశ్వర్ రావు, రంగారావు ఎమ్మెల్యేలు కాగలిగినా కాంగ్రెస్ పార్టీలో పెద్దగా ప్రాభవం పొందలేకపోయారు. తాజాగా పీవీ తనయ వాణీదేవి టీఆర్ఎస్ పక్షాన ఎమ్మెల్సీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో చతురునిగా పేరుగాంచిన నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి కుమారుడు రామ్ కుమార్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీని వీడారు. ఆయన వైఎస్సార్సీపీలో చేరారు. కార్పోరేషన్ చైర్మెన్ అయ్యారు.

నాదెండ్లతో మొదలు కేసీఆర్ దాకా

ఇక కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాత ముఖ్యమంత్రులైన వారిలో ప్రధానంగా చెప్పుకోవాల్సిన పేర్లు కొన్ని వున్నాయి. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించక ముందు కాంగ్రెస్ పార్టీలో వున్న నాదెండ్ల భాస్కర్ రావు.. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి నెల రోజులపాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1984 ఆగస్టు సంక్షోభంలో ఆయన నెలరోజుల ముఖ్యమంత్రిగా పేరుగాంచారు. ఉవ్వెత్తున ఎగిసిన ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంతో ఆయన రాజీనామా చేశారు. అయితే, ఆయన ముఖ్యమంత్రి కాకముందు, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం విశేషం. ఇక ఈ కోవలో తరువాత వచ్చే పేరు చంద్రబాబు నాయుడు. 1978లో రాజకీయ అరంగేట్రం చేసిన చంద్రబాబు తొలుత కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. టీ.అంజయ్య హయాంలో సినిమాటోగ్రఫీ శాఖా మంత్రిగా చంద్రబాబు పని చేశారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టిన సందర్బంలో అవసరమైతే మామ ఎన్టీఆర్‌పై పోటీ చేస్తానని హూంకరించారు. చివరికి మామ పిలుపుతో చంద్రబాబు టీడీపీలో చేరి పలు పదవులు పొందారు. 1995 ఆగస్టు రాజకీయ సంక్షోభంలో వ్యూహాత్మకంగా చంద్రబాబు సీఎం అయ్యారు. ఉమ్మడి ఏపీని అత్యధిక కాలం పాలించిన ముఖ్యమంత్రిగా రికార్డు సాధించారు. రాష్ట్ర విభజన తర్వాత విభజిత ఏపీకి కూడా చంద్రబాబు అయిదేళ్ళపాటు సీఎంగా పని చేశారు. ఇక ఈ కోవలోకి వచ్చే మరోపేరు కేసీఆర్. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తొలుత రాజకీయాల్లోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ద్వారానే. 70వ దశకంలో కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా వున్న మదన్ మోహన్ శిష్యునిగా కేసీఆర్ రాజకీయాల్లోకి వచ్చారు. యువజన కాంగ్రెస్‌లో పనిచేశారు. ఆ తర్వాత ఎన్టీఆర్ పార్టీని స్థాపించినపుడు టీడీపీలో చేరారు. 1983లో తన రాజకీయ గురువుగా చెప్పుకునే మదన్ మోహన్‌పై పోటీ చేసి ఓడిపోయారు. 1985 నుంచి 1999 దాకా నాలుగుసార్లు సిద్దిపేట నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున వరుసగా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎన్టీఆర్, చంద్రబాబు కేబినెట్లలో మంత్రిపదవులు నిర్వహించారు. 1999లో మరోసారి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రి పదవిని ఆశించి భంగపడ్డారు. చంద్రబాబు అప్పట్లో కేసీఆర్‌కు డిప్యూటీ సీఎం పదవినిచ్చారు. ఈక్రమంలో కేసీఆర్ 2001దాకా టీడీపీలో కొనసాగారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించి, తెలంగాణ రాష్ట్ర సాధనకు 13 ఏళ్ళపాటు అవిరళంగా పోరాడారు. తెలంగాణ సాధించిన నేతగా 2014 నుంచి ముఖ్యమంత్రి పదవిలో కేసీఆర్ కొనసాగుతున్నారు. ఈక్రమంలో కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాత సీఎంలు అయిన వారిలో నాదెండ్ల భాస్కర్ రావు, చంద్రబాబునాయుడు, కేసీఆర్, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిల పేర్లను ప్రస్తావించవచ్చు.

లక్నోతో మ్యాచ్.. టాస్ ఓడిన చెన్నై.. డ్యాషింగ్ బ్యాటర్ మళ్లొచ్చాడు
లక్నోతో మ్యాచ్.. టాస్ ఓడిన చెన్నై.. డ్యాషింగ్ బ్యాటర్ మళ్లొచ్చాడు
కాలేజీ రోజుల్లో బాడీ షేమింగ్.. ఇప్పుడు సౌత్ కుర్రాళ్ల దిల్ క్రష్
కాలేజీ రోజుల్లో బాడీ షేమింగ్.. ఇప్పుడు సౌత్ కుర్రాళ్ల దిల్ క్రష్
కేసీఆర్ ఏం మాట్లాడుతారు.? ఓటమిపై ఎలా స్పందిస్తారు.?
కేసీఆర్ ఏం మాట్లాడుతారు.? ఓటమిపై ఎలా స్పందిస్తారు.?
400 ఏళ్ల క్రితం 2 అడుగులున్న హనుమాన్ విగ్రహం నేడు 12 అడుగులు..
400 ఏళ్ల క్రితం 2 అడుగులున్న హనుమాన్ విగ్రహం నేడు 12 అడుగులు..
పుష్కర కాలం తర్వాత సంచలన ఇంటర్వ్యూ.. కేసీఆర్‌ మనోగతం ఏంటి?
పుష్కర కాలం తర్వాత సంచలన ఇంటర్వ్యూ.. కేసీఆర్‌ మనోగతం ఏంటి?
హే చిచ్చా.! ఈ ఫోటోలో గుడ్లగూబ కనిపించిందా.? గురిస్తే గ్రేటే..
హే చిచ్చా.! ఈ ఫోటోలో గుడ్లగూబ కనిపించిందా.? గురిస్తే గ్రేటే..
లోక్‌సభ ఎన్నికల బరిలో బర్రెలక్క.. భర్తతో కలిసి నామినేషన్..
లోక్‌సభ ఎన్నికల బరిలో బర్రెలక్క.. భర్తతో కలిసి నామినేషన్..
కల్కి హీరోయిన్ సిస్టర్ ఇండియన్ ఆర్మీలో ఏం చేసేవారో తెలుసా..?
కల్కి హీరోయిన్ సిస్టర్ ఇండియన్ ఆర్మీలో ఏం చేసేవారో తెలుసా..?
ఎండలో వెళితే ఈ చిట్కాలు పాటించండి..మైగ్రేన్ సమస్య దరిదాపులకురాదు
ఎండలో వెళితే ఈ చిట్కాలు పాటించండి..మైగ్రేన్ సమస్య దరిదాపులకురాదు
ముస్లిం ఓట్లపై ఆ నేతలు కన్ను.. గెలుస్తారా? బీజేపీకి ప్లస్ అవుతారా
ముస్లిం ఓట్లపై ఆ నేతలు కన్ను.. గెలుస్తారా? బీజేపీకి ప్లస్ అవుతారా
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్