Huzurabad By-Election: కళ్లల్లో మట్టికొట్టి.. మన బతుకులను ఛిద్రం చేశారు.. టీఆర్ఎస్ సర్కార్‌పై ఈటల నిప్పులు..

దళిత బంధును ఎవరో ఆపుతున్నట్టు టీఆర్ఎస్ నేతలు కామెంట్స్ చేస్తున్నారని బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ మండిపడ్డారు. ఇవాళ కమలాపూర్ మండలం మర్రిపల్లిలో ఈటల ప్రచారం నిర్వహించారు.

Huzurabad By-Election: కళ్లల్లో మట్టికొట్టి.. మన బతుకులను ఛిద్రం చేశారు.. టీఆర్ఎస్ సర్కార్‌పై ఈటల నిప్పులు..
Etela Rajender
Follow us

|

Updated on: Oct 21, 2021 | 1:57 PM

దళిత బంధును ఎవరో ఆపుతున్నట్టు టీఆర్ఎస్ నేతలు కామెంట్స్ చేస్తున్నారని బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ మండిపడ్డారు. ఇవాళ కమలాపూర్ మండలం మర్రిపల్లిలో ఈటల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాత్కాలికంగా నిజం ఓడిపోయినట్లు కనిపించొచ్చు.. నిజం నిప్పులాంటిది తప్పకుండా బయటకు వస్తుంది. ఉద్యమసమయంలో కేసీఆర్ తెలంగాణలో 85 శాతం దళిత, బీసీలే ఉన్నారన్నారు. దళితుడినే మొదటి సీఎం చేస్తానని.. మాట తప్పను అన్నారు.. అవసరమైతే తల నరుక్కంటా అన్నారు. గతంలో దళితులను అవమానించి, గంజిలో ఈగలాగా కేసీఆర్ తీసేసారు. ఎప్పుడూ దళితులను మోసం చేస్తూన్నది టీఆర్‌ఎస్ అంటూ  వ్యాఖ్యానించారు. దళితులకు సబ్సీడీ రుణాలు ఇవ్వకుండా మోసం చేశారని.. డబుల్ బెడ్ రూంలు ఇవ్వలేదని టీఆర్‌ఎస్ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. దళితబంధుతో మోసం చేస్తున్నారని ఎవరూ అనట్లే అహో.. ఓహో అంటున్నారని అన్నారు. దళితులకు తప్పకుండా దళితబంధు ఇవ్వాలని డిమాండ్ చేసినా.. డిమాండ్ చేస్తున్నా కూడా అని స్పష్టం చేశారు ఈటల.

మూడెకరాల భూమి ఎగ్గొట్టాడు. డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వలేదు. దళితుల ప్రైడ్ అనే స్కీం పెట్టినా.. వారికి రావాల్సిన రుణాల సబ్సిడీ ఇవ్వకుండా చెలగాటమాడుతున్నాడు. ఇప్పుడేమో చివరి రక్తం బొట్టు వరకు దళితులకే తన జీవితం అంకితమంటున్నాడు. సీఎం మోసాన్ని గ్రహించకుండా కొంతమంది మేధావులు ఆహో, ఓహో అంటున్నారు. దళితబంధును ఎవరూ వద్దనడం లేదు. కానీ పదిలక్షలపై సంపూర్ణ అధికారం ఇవ్వాలంటున్నాం. మన కళ్లల్లో మట్టికొట్టి, మన బతుకులను ఛిద్రం చేసాడు కేసీఆర్.

హుజూరాబాద్ దెబ్బకే ఫించన్లు, రేషన్ కార్డులు, ఇళ్ళస్థలాలు ఉన్నవాళ్ళకీ ఇండ్లు కట్టుకునే జీవో వస్తున్నాయని అన్నారు. ఎన్నికలు ఉంటేనే హమీలు, చెక్కులు ఇస్తారని.. ఇది  టీఆర్‌ఎస్ నైజమని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈటలను ఓడగొట్టలనే ఇన్ని హమీలు, ఇన్ని నిధులు ఈ నియోజకవర్గానికి ఇచ్చారని అంతేకానీ.. ప్రజల మీద ఎలాంటి ప్రేమ లేదని తెలిపారు. కేసీఆర్‌కు ఎప్పటికీ నేను, నా కొడుకు రాజ్యం.. పాలన ఉండాలనే తపన  ఉంటుందన్నారు. ఇక్కడ ప్రజాప్రతినిధులకు బిల్లులు, డబ్బులు ఈటల వలనే వస్తున్నాయని చెప్పారు. 30 తరువాత వీళ్ళ అందరీ బతుకు బజారుపాలే అని.. ఎవరు పట్టించుకోరు వీళ్ళను అని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి: 100 Crore Vaccination: 100 కోట్ల మార్కును దాటిందోచ్.. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌లో దూసుకుపోతున్న భారత్..

ఈ చిన్నది ఓ స్టార్ హీరోయిన్ చెల్లి.. ఆ పాన్ ఇండియా నటి ఎవరంటే.?
ఈ చిన్నది ఓ స్టార్ హీరోయిన్ చెల్లి.. ఆ పాన్ ఇండియా నటి ఎవరంటే.?
వామ్మో, ఇదేం డ్యాన్స్‌రా సామీ.. నాగిని పాటకు పైథాన్‌ స్టెప్పులు..
వామ్మో, ఇదేం డ్యాన్స్‌రా సామీ.. నాగిని పాటకు పైథాన్‌ స్టెప్పులు..
మహేష్ బాబుతో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.?
మహేష్ బాబుతో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.?
ఇంటర్‎లో ఫెయిల్ అయిన ఇద్దరు విద్యార్థులు.. మనస్థాపంతో ఆత్మహత్య..
ఇంటర్‎లో ఫెయిల్ అయిన ఇద్దరు విద్యార్థులు.. మనస్థాపంతో ఆత్మహత్య..
స్దాన బలం గురించి వేమన చెప్పిన పద్యానికి సజీవ సాక్ష్యం ఈ వీడియో
స్దాన బలం గురించి వేమన చెప్పిన పద్యానికి సజీవ సాక్ష్యం ఈ వీడియో
ఢిల్లీతో మ్యాచ్.. సెంచరీ కొట్టేసిన శుభ్‌మన్ గిల్..అరుదైన రికార్డు
ఢిల్లీతో మ్యాచ్.. సెంచరీ కొట్టేసిన శుభ్‌మన్ గిల్..అరుదైన రికార్డు
దెబ్బేసిన తెలుగోడు.. టీ20 వరల్డ్‌కప్ జట్టులో హర్దిక్‌ నో ప్లేస్.!
దెబ్బేసిన తెలుగోడు.. టీ20 వరల్డ్‌కప్ జట్టులో హర్దిక్‌ నో ప్లేస్.!
ఐపీఎల్‌లో శివ తాండవం.. ఈ ప్లేయర్ టీ20 ప్రపంచకప్ లో ఉండాల్సిందే
ఐపీఎల్‌లో శివ తాండవం.. ఈ ప్లేయర్ టీ20 ప్రపంచకప్ లో ఉండాల్సిందే
కవిత బెయిల్ పిటిషన్‎పై ముగిసిన వాదనలు.. కోర్టులో తీర్పు రిజర్వ్..
కవిత బెయిల్ పిటిషన్‎పై ముగిసిన వాదనలు.. కోర్టులో తీర్పు రిజర్వ్..
మట్టి కుండతో మ్యాజిక్‌..! దేశీ జుగాఢ్ జాదు చూస్తే మతిపోవాల్సిందే!
మట్టి కుండతో మ్యాజిక్‌..! దేశీ జుగాఢ్ జాదు చూస్తే మతిపోవాల్సిందే!