సొంత పార్టీపై వీహెచ్ వివాదాస్పద వ్యాఖ్యలు
సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ విధానాలను ఆ పార్టీ సీనియర్ నేత వీహెచ్ తప్పుపట్టారు. కాంగ్రెస్లో నిజమైన కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో కొత్తగా చేరిన వారికి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల సీనియర్లకు గుర్తింపు దక్కడం లేదని వాపోయారు. అన్ని పార్టీలు ధనికులకే టికెట్లు ఇస్తున్నాయని ఆరోపించారు. అందువల్లే ఎన్నికల్లో సామాన్యులు పోటీ చేయలేని పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ఈ విధానంలో మార్పు రావాలని కోరారు. తెలంగాణలో అగ్రకులాల ఆధిపత్యమే కొనసాగుతోందన్నారు. […]
సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ విధానాలను ఆ పార్టీ సీనియర్ నేత వీహెచ్ తప్పుపట్టారు. కాంగ్రెస్లో నిజమైన కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో కొత్తగా చేరిన వారికి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల సీనియర్లకు గుర్తింపు దక్కడం లేదని వాపోయారు. అన్ని పార్టీలు ధనికులకే టికెట్లు ఇస్తున్నాయని ఆరోపించారు. అందువల్లే ఎన్నికల్లో సామాన్యులు పోటీ చేయలేని పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ఈ విధానంలో మార్పు రావాలని కోరారు. తెలంగాణలో అగ్రకులాల ఆధిపత్యమే కొనసాగుతోందన్నారు. కాంగ్రెస్లో కూడా ఇదే పరిస్థితి ఉందని విమర్శించారు.