రేవంత్.. నువ్వేం తీస్మార్ ఖాన్ కాదు..!
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి పార్టీ పరువు తీస్తున్నారని ఆయన మండిపడ్డారు. సమస్యలపై ఎవరైనా పద్దతి ప్రకారం పోరాడాలని ఆయన అన్నారు
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి పార్టీ పరువు తీస్తున్నారని ఆయన మండిపడ్డారు. సమస్యలపై ఎవరైనా పద్దతి ప్రకారం పోరాడాలని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి ఒక్కడే తీస్మార్ ఖాన్ కాదని, ఆయన తీరుపై సోనియా గాంధీకి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉందని జగ్గారెడ్డి గుర్తు చేశారు. పీసీసీ పదవి కోసం ఆయన ఆరాటపడుతున్నారని.. తనకు కూడా పీసీసీ చీఫ్ పదవి కావాలని ఆయన అన్నారు. ఇక రేవంత్ రెడ్డి అనుచరులు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని.. వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఇప్పటికైనా ఆయన అనుచరులు నోరు మూసుకోవాలని.. చేసే పిచ్చి పిచ్చి ప్రచారం మానుకోవాలని జగ్గారెడ్డి హితవు పలికారు. కాగా ఇదివరకే ఒకసారి జగ్గారెడ్డి, రేవంత్పై విరుచుకుపడ్డారు. సోషల్ మీడియాలో సొంత డబ్బా కొట్టుకోవడం, జైలుకెళ్లాం కాబట్టి పదవులు వస్తాయని భ్రమలో ఉండడం రేవంత్కు అలవాటైపోయిందని జగ్గారెడ్డి విమర్శించిన విషయం తెలిసిందే