ఎన్నికల అనంతర హింసపై కలకత్తా హైకోర్టు సీరియస్…. మధ్యంతర ఉత్తర్వులపై స్టే ఇవ్వాలన్న సీఎం మమతా బెనర్జీ

బెంగాల్ లో ఎన్నికల అనంతర హింసపై కలకత్తా హైకోర్టు సీరియస్ అయింది. హింసను అణచలేక ఈ ప్రభుత్వం నిస్సహాయంగా చూస్తున్ననట్టు ఉందని పేర్కొంది.

ఎన్నికల అనంతర హింసపై కలకత్తా హైకోర్టు సీరియస్.... మధ్యంతర ఉత్తర్వులపై స్టే ఇవ్వాలన్న సీఎం మమతా బెనర్జీ
Follow us

| Edited By: Phani CH

Updated on: Jun 20, 2021 | 3:45 PM

బెంగాల్ లో ఎన్నికల అనంతర హింసపై కలకత్తా హైకోర్టు సీరియస్ అయింది. హింసను అణచలేక ఈ ప్రభుత్వం నిస్సహాయంగా చూస్తున్ననట్టు ఉందని పేర్కొంది. రాష్ట్రంలో అల్లర్లను అదుపు చేయాల్సిన బాధ్యత…అదే సమయంలో ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించుకోవలసిన కర్తవ్యం ఈ ప్రభుత్వంపై ఉందని, కానీ…ఇది చాలా ఇనాక్టివ్ (చలనరహితంగా) గా ఉందని విమర్శించింది. రాష్ట్రంలోని శాంతి భద్రతల పరిస్థితిపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కమిటీని ఏర్పాటు చేసి తన నివేదికను ఈ నెల 30 లోగా సమర్పించాలని 5 గురు జడ్జీలతో కూడిన బెంచ్ ఆదేశించింది. ఎన్నికల అనంతర హింసతో బాటు ఇప్పటికీ అనేక చోట్ల అల్లర్లు కొనసాగుతున్నాయంటూ దాఖలైన పిల్స్ ను ఈ బెంచ్ విచారించింది. ఈ కమిటీ అన్ని కేసులను దర్యాప్తు చేయాలని..సమగ్రమైన రిపోర్టు దాఖలు చేయాలని కూడా కోర్టు సూచించింది. ఈ కమిటీ సభ్యులు ఏ ప్రాంతానికి వెళ్లినా వారికి అవరోధాలు కల్పించరాదని… ప్రభుత్వం సహకరించాలని కోర్టు కోరింది.లేని పక్షంలో కోర్టు ధిక్కార చర్యలతో సహా ప్రభుత్వంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

కాగా ఈ ఆదేశాలపై స్టే ఉత్తర్వులు ఇవ్వాలని మమత ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. తాము శాంతిభద్రతలకు ప్రాధాన్యం ఇస్తున్నామని, పోలీసులు ఎప్పటికప్పుడు లా అండ్ ఆర్డర్ ను పర్యవేక్షిస్తున్నారని పిటిషన్ లో పేర్కొంది. ఎన్నికల తరువాత రాష్ట్రంలో అక్కడక్కడా హింస జరిగిన మాట వాస్తవమేనని, కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని వివరించింది. ఇలా ఉండగా ఇటీవల గవర్నర్ జగ దీప్ ధన్ కర్ ..ఢిల్లీకి కూడా వెళ్లి రాష్ట్రంలోని పరిస్థితులను బీజేపీ నేతలకు ఏకరువు పెట్టారు.

మరిన్ని ఇక్కడ చూడండి: Tokyo Olympics: జపాన్ నిబంధనలు చాలా దారుణం: భారతీయ ఒలింపిక్ అసోసియేషన్‌ ప్రతినిధులు

Errabelli : కేసీఆర్ లాంటి మంచి ముఖ్యమంత్రిని చూడలేదు, హుజూరాబాద్ కు ఈటెల ఎవర్నీ రానిచ్చేవాడు కాదు : ఎర్రబెల్లి

తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..