అట్టుడికిన ఉక్కునగరం.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కదంతొక్కిన కార్మికులు
విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణపై నిరసనలు వెల్లువెత్తాయి. భారీ సంఖ్యలో స్టీల్ ప్లాంట్ కార్మికులు, ఉద్యోగులు బైక్ ర్యాలీలు, నిరసనలతో..
విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణపై నిరసనలు వెల్లువెత్తాయి. భారీ సంఖ్యలో స్టీల్ ప్లాంట్ కార్మికులు, ఉద్యోగులు బైక్ ర్యాలీలు, నిరసనలతో ఉక్కునగరం అట్టుడికింది. నిరసనల్లో ఆల్ ట్రేడ్ యూనియన్లు పాల్గొన్నాయి. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మికుల నిరసనలకు వైసీపీ ఎంపీలు మద్దతు పలికారు.
విశాఖ ఉక్కును సాధించుకుంటామని స్టీల్ ప్లాంట్ కార్మికులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ర్యాలీలో అఖిలపక్ష కార్మిక సంఘాల నేతలు రామారావు, ఆదినారాయణరావు, వెంకట్రావు, అయోధ్యరామ్, తదితరులు పాల్గొన్నారు. స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేస్తే ఉద్యమం తప్పదని ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి హెచ్చరించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని, స్టీల్ ప్లాంట్ కోసం ఎటువంటి త్యాగానికైనా సిద్ధమని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తెలిపారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణనను లోక్సభలో అడ్డుకుంటామని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడేందుకు లోక్సభలో పోరాడతామని మరో ఎంపీ సత్యవతి అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల బాటలో పయనించిందని, వేల కోట్లను కేంద్ర,రాష్ట్రాలకు పన్నుల రూపంలో ఆర్జించి పెట్టిందని గుర్తు చేశారు.
Read more:
ఓటు బ్యాంక్ లేకుంటే.. భయమెందుకు..? నోటా పార్టీ అనుకుంటే.. నోరు జారకండి.. ఆ మంత్రికి సోము చురకలు