Vellampalli: ‘ప్రజలు కోరుకుంటున్నది మాటల మనష్యుల్ని కాదు.. చేతల మనిషి వైయస్ జగన్ను’
ఏపీ ప్రజలు కోరుకుంటున్నది మాటల మనిషి చంద్రబాబును కాదని.. చేతల మనిషి అయిన వైయస్ జగన్మోహన్రెడ్డిని అని చెప్పుకొచ్చారు మంత్రి..
Minister Vellampalli: ఏపీ ప్రజలు కోరుకుంటున్నది మాటల మనిషి చంద్రబాబును కాదని.. చేతల మనిషి అయిన వైయస్ జగన్మోహన్రెడ్డిని అని చెప్పుకొచ్చారు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. వైయస్ఆర్సీపీ మినహా రాష్ట్రంలో ఇతర పార్టీలకు చోటు లేదన్నది ఇటీవల వెల్లడైన పరిషత్ ఎన్నికల ఫలితాల్లో రుజువైందని అన్నారు. టీడీపీ నేతలు డ్రగ్స్ సేవించి మాట్లాడుతున్నట్లుగా ఉందని మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్ర ప్రజలు ఎవరూ కూడా చంద్రబాబు మాటలను నమ్మలేదని స్పష్టమైందని మంత్రి వెల్లంపల్లి చెప్పారు. గతంలో జరిగిన పంచాయతీ, తిరుపతి ఉప ఎన్నిక, మున్సిపల్ ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కాళ్లకు బలపాలు కట్టుకుని సందు సందులో తిరిగారు. తిరుపతిలో బీజేపీ నాయకులు మకాం వేసినా కూడా వైయస్ఆర్సీపీకే ఓటర్లు పట్టం కట్టారని మంత్రి తెలిపారు.
తిరుపతి ఉపఎన్నిక సమయంలో అచ్చెన్న భోజనం చేస్తూ ఈ మాటలు అన్నారు. భోజనం చేసే సమయంలో ఎవరూ అబద్ధం చెప్పరు. యనమల, చంద్రమోహన్రెడ్డిలేమో మనకు ఎస్సీలు, బీసీలు లేరని జూమ్ మీటింగ్లో చర్చించుకునేది అందరూ చూశారంటూ మంత్రి వెల్లంపల్లి అన్నారు. అలా మాట్లాడిన వ్యక్తులు ఈ రోజు ఇష్టం వచ్చినట్లు అవాకులు, చవాకులు పేలుతున్నారని ఇది చాలా విడ్డూరంగా ఉందని విమర్శించారు.
చివరికి కుప్పం ప్రజలు కూడా ఈ రోజు ఛీ పో.. అంటూ చంద్రబాబుకు ఛీకొట్టారని ఎద్దేవా చేశారు మంత్రి వెల్లంపల్లి. కుప్పం ప్రజలు ఏకపక్షంగా వైయస్ జగన్కు మద్దతు పలికారు.. నందమూరి తారక రామారావు సొంతూరు నిమ్మకూరు ప్రజలు కూడా వైయస్ జగన్ అవసరమని ఓటు వేశారు. దీనిని అందరూ గుర్తించాలని విపక్షాలకు మంత్రి సూచించారు.
Read also: Village President: గ్రామ సమస్యలపై ప్రశ్నించిన గ్రామస్తుడ్ని నడిరోడ్డులో బూటుకాలితో తన్నిన సర్పంచ్.!