కోడెల శివప్రసాదరావు మృతి ఓ మిస్టరీ: ఎన్నో మలుపులు..?

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతి నిజంగా మిస్టరీగా మారింది. నిన్న అనూహ్యరీతిలో ఆయన ఆత్మహత్య చేసుకోవడంతో.. ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఆయన మరణవార్త తెలియగానే.. కోడెల అభిమానులు, కార్యకర్తలు పెద్దఎత్తున ఇంటికి చేరుకున్నారు. అసలు నిజంగానే ఆయన ఆత్మహత్య చేసుకున్నారా..! మేము నమ్మలేకపోతున్నామంటూ.. బోరున విలపిస్తున్నారు. కోడెల శివప్రసాద రావు ఆత్మహత్యనే చేసుకుని మృతి చెందారని బసవతారకం హాస్పిటల్ డాక్టర్లు ప్రాథమికంగా.. రిపోర్టు ఇచ్చినా.. పోస్టుమార్టం రిపోర్టు వస్తే కానీ.. అసలు విషయం తెలియదు. […]

కోడెల శివప్రసాదరావు మృతి ఓ మిస్టరీ: ఎన్నో మలుపులు..?
Follow us

| Edited By:

Updated on: Sep 17, 2019 | 1:21 PM

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతి నిజంగా మిస్టరీగా మారింది. నిన్న అనూహ్యరీతిలో ఆయన ఆత్మహత్య చేసుకోవడంతో.. ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఆయన మరణవార్త తెలియగానే.. కోడెల అభిమానులు, కార్యకర్తలు పెద్దఎత్తున ఇంటికి చేరుకున్నారు. అసలు నిజంగానే ఆయన ఆత్మహత్య చేసుకున్నారా..! మేము నమ్మలేకపోతున్నామంటూ.. బోరున విలపిస్తున్నారు. కోడెల శివప్రసాద రావు ఆత్మహత్యనే చేసుకుని మృతి చెందారని బసవతారకం హాస్పిటల్ డాక్టర్లు ప్రాథమికంగా.. రిపోర్టు ఇచ్చినా.. పోస్టుమార్టం రిపోర్టు వస్తే కానీ.. అసలు విషయం తెలియదు.

కాగా.. కోడెల డెత్ మిస్టరీ కాస్తా.. ఇప్పుడు రాజకీయ రంగులు పులుముకుంది. ‘మీ టార్చర్, వేధింపుల కారణంగానే.. కోడెల మృతి చెందారని టీడీపీ వర్గం.. వైసీపీని విమర్శిస్తుంటే.. కాదు.. మీ నిర్లక్ష్యంతోనే ఆయన మరణించాడని.. వైసీపీ.. టీడీపీపై ప్రత్యారోపణలు చేస్తోంది. అయితే.. కోడెల గన్‌మెన్ ఆదామ్.. మాత్రం.. ఆయన ఉరివేసుకుని చనిపోయారని చెబుతున్నారు. కోడెలను స్వయంగా.. గన్‌మెన్, హెంగార్డులే ఆస్పత్రికి తీసుకువచ్చారు.

ఉదయం 9.30 సయంలో.. కోడెల సార్.. ఇంటిలోని ఫస్ట్ ఫ్లోర్‌కి వెళ్లడాన్ని నేను చూశానని.. ఆ తరువాత విజయలక్ష్మీ మేడమ్.. 11 గంటలకు పైకి వెళ్లి ఎంత కొట్టినా.. సార్ తలుపులు తీయకపోయేసరికి.. గట్టిగా అరిచిందని అన్నారు. దీంతో.. మేము వెళ్లి.. పిలిచినా.. తలుపులు తీయకపోవడంతో.. కిటికీ గేట్ నుంచి లోపలికి వెళ్లినట్టు తెలిపాడు. లోపలికి వెళ్లగానే.. నైలాన్‌ తాడుకు సార్ వేలాడుతూ.. కనిపించారని.. అది చూసి మేమందరం షాక్‌కి గురై.. వెంటనే ఆస్పత్రికి తరలించామని.. గన్‌మెన్ ఆదామ్ చెప్పాడు. అలాగే.. కోడెల కూతురు విజయలక్ష్మి కూడా.. వైసీపీ ప్రభుత్వ వేధింపులే కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు.

ఈ రకంగా చూస్తే.. వైసీపీ వేధింపులతోనే ఆయన మరణించారా..? నిజంగానే.. ఆత్మహత్య చేసుకున్నారా..? కోడెలపై 32 కేసులు, ఆయన కూతురు, కొడుకులపై కేసులు ఇలా.. అన్నీ ఆయన్ని ఉక్కిరి బిక్కిరి చేశాయా..! ఒకవేళ అవి రుజువైతే.. ఆయన జైలుకెళ్లాల్సి వస్తుంది. ఎక్కడ తన పరువు పోతుందని.. భయంతోనే.. ఆయన ఆత్మహత్య చేసుకున్నాడనే వాదనలు కూడా వినవస్తున్నాయి.

కాగా.. మరో ఆసక్తికర విషయమేమిటంటే.. కోడెలపై ఉన్న కేసుల కారణంగా.. రోజూ ఆయనకి.. డీజీపీ ఫోన్‌ చేసి మాట్లాడేవారని.. దీంతో.. ఆయన ఇంకా భయాందోళన చెందేవారని.. ఆయన సన్నిహితులు తెలిపారు.

అటు.. ఈ కేసుల గురించి చంద్రబాబు కూడా.. ఆయనతో సఖ్యతగా లేకపోవడం.. టీడీపీలోని మరో వర్గం ఆయనకు యాంటీగా నిలవడం కూడా.. ఆయన్ను ఒకింత ఆందోళకు గురిచేసినట్టు తెలుస్తోంది. కానీ.. స్పీకర్‌గా వ్యవహరించిన వ్యక్తి.. పల్నాడు పులి అని కూడా పేరుతెచ్చుకున్న కోడెల ఇలా ఆత్మహత్య చేసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.