కమలం వైపు చూస్తున్న కొండా దంపతులు

కొండా దంపతులు కొంతకాలంగా పొలిటికల్‌గా సైలంట్ అయిపోయారు. జరుగుతోన్న రాజకీయాన్ని చూడటం తప్ప.. తమదైన పాత్ర పోషించే అవకాశం రాక అల్లాడుతున్నారట. ఒకప్పుడు ఉమ్మడి ఏపీలో వరంగల్ జిల్లా రాజకీయాలను శాసించారు కొండా దంపతులు. కానీ.. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో మెల్లి మెల్లిగా తమ ప్రభావాన్ని కోల్పోతూ వచ్చారు. 2014కి ముందు కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి.. కారెక్కి.. కొండా సురేఖ వరంగల్ తూర్పు నుంచి విజయంసాధించారు. అటు కొండా మురళికి ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించింది […]

కమలం వైపు చూస్తున్న కొండా దంపతులు
Follow us

| Edited By:

Updated on: Jul 19, 2019 | 9:49 PM

కొండా దంపతులు కొంతకాలంగా పొలిటికల్‌గా సైలంట్ అయిపోయారు. జరుగుతోన్న రాజకీయాన్ని చూడటం తప్ప.. తమదైన పాత్ర పోషించే అవకాశం రాక అల్లాడుతున్నారట. ఒకప్పుడు ఉమ్మడి ఏపీలో వరంగల్ జిల్లా రాజకీయాలను శాసించారు కొండా దంపతులు. కానీ.. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో మెల్లి మెల్లిగా తమ ప్రభావాన్ని కోల్పోతూ వచ్చారు. 2014కి ముందు కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి.. కారెక్కి.. కొండా సురేఖ వరంగల్ తూర్పు నుంచి విజయంసాధించారు. అటు కొండా మురళికి ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించింది టీఆర్ఎస్ అధిష్టానం. 2019 ఎన్నికల వేళ తన కుంటుంబానికి రెండు టికెట్లు కావాలని కొండా సురేఖ తేల్చి చెప్పడంతో.. ఒకటి కూడా లేదనేసింది టీఆర్ఎస్ అధిష్టానం. ఆ తర్వాత పార్టీ హైకమాండ్‌కి డెడ్‌లైన్ వార్నింగ్ ఇస్తూ.. రసవత్తర ఘట్టానికి తెర తీసే ప్రయత్నం చేశారు కొండా దంపతులు. కానీ.. ఆ ఎపిసోడ్ రక్తికట్టలేదు. పొమ్మనేదాకా పరిస్థితి రావడంతో ఒక్కసారిగా సొంతగూడు గుర్తొచ్చింది. గులాబీ కండువాలు తీసేసి కాంగ్రెస్ కండువాలు వేసేసుకున్నారు.

లాస్ట్ మినిట్‌లో పార్ట మారి పరకాల టిక్కెట్టు సాధించి.. కాంగ్రెస్ నుంచి బరిలొకి దిగారు కొండా సురేఖ. కానీ.. కారు స్పీడ్‌కి తెలంగాణలో మహాకూటమి ఘోర పరాజయం పాలైంది. ఓడిన కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాలో కొండ సురేఖ కూడా చేరారు. నాటి నుంచి కొండా దంపతులు పొలిటికల్‌గా మరింత వీక్ అయ్యారట. కాంగ్రెస్‌లో ఉంటే ఇక కష్టం అనుకుంటున్న వాళ్లంతా కారెక్కడం మొదలుపెట్టారు. కానీ కొండా దంపతులకి ఆ అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే టీఆర్ఎస్ హైకమాండ్‌తో ఘర్షణ పడి.. సవాళ్లు విసిరి కారు దిగిపోయారు. ఇక మిగిలిన ఆప్షన్ బీజేపీ మాత్రమే. దీంతో ఇప్పుడు కొండా దంపతులు కమలనాథులుగా మారే ప్రయత్నాలు మొదలుపెట్టారని జిల్లాలో జోరుగా ప్రచారం సాగుతోందట.

అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక్క ఎమ్మెల్యేను గెల్చుకున్న బీజేపీ.. సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం నాలుగు ఎంపీ స్థానాలను గెల్చుకుని సంచలనం సృష్టించింది. మరోవైపు డీఎస్ తనయుడు అరవింద్ నిజామాబాద్ నుంచి ఎంపీగా గెల్చారు. డీఎస్ కూడా బీజేపీకి దగ్గరగా జరుగుతున్నారు. కొండా దంపతులది కూడా అదే సామాజికవర్గం. కాంగ్రెస్‌లో ఉన్న వేళ డీఎస్‌తో మంచి సంబంధాలున్నాయి. ఇప్పుడు బీజేపీలో చేరితే తిరిగి పూర్వవైభవం సాధించవచ్చని కొండా దంపతులు భావిస్తున్నారట. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో భూపాలపల్లి టిక్కెట్టు ఇవ్వాలని కొండా సురేఖ షరతు పెడుతున్నారట. అయితే గత ఎన్నికల్లో టీఆర్ఎస్ రెబెల్‌గా పోటీ చేసిన గండ్ర సత్యనారాయణ కూడా ఇదే షరతుపై బీజేపీ వైపు చూస్తున్నారట. దీంతో.. బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఏం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ భూపాలపల్లి టికెట్టు హామీ లభిస్తే కొండా దంపతులు కాషాయ కండువాలు వేసుకోవడం ఖాయమని రాజకీయ వర్గాల్లో ప్రచారం నడుస్తోందట.

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!