Hot news: టీటీడీ ఆస్తుల వేలంపై రాజకీయ రచ్చ

తిరుమలేశునికి వివిధ రాష్ట్రాలలో వున్న ఆస్తులను విక్రయించాలన్న టీటీడీ ట్రస్టు బోర్డు నిర్ణయంపై రాజకీయ వివాదం రాజుకుంటోంది. బీజేపీ, సీపీఐ పక్షాలే కాకుండా సామాన్య భక్తజనం టీటీడీ నిర్ణయంపై మండిపడుతున్నారు.

Hot news: టీటీడీ ఆస్తుల వేలంపై రాజకీయ రచ్చ
Follow us

|

Updated on: May 24, 2020 | 1:10 PM

Political uproar over TTD trust board decision on assets auction:  తిరుమలేశునికి వివిధ రాష్ట్రాలలో వున్న ఆస్తులను విక్రయించాలన్న టీటీడీ ట్రస్టు బోర్డు నిర్ణయంపై రాజకీయ వివాదం రాజుకుంటోంది. బీజేపీ, సీపీఐ పక్షాలే కాకుండా సామాన్య భక్తజనం టీటీడీ నిర్ణయంపై మండిపడుతున్నారు. తమిళనాడు, రుషికేశ్‌లలో వున్న టీటీడీ ఆస్తుల వేలం ప్రక్రియను ఆపకపోతే రోడ్డెక్కి ఆందోళన చేస్తామని బీజేపీ, సీపీఐ నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.

తమిలనాడులో టీటీడీ ఆస్తుల విక్రయాన్ని వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ఒకటో టౌన్‌ ఓ శ్రీవారి భక్తుడు నిరసన దీక్ష చేపట్టారు. 1వ టౌన్ ఏరియాలో నిరసన దీక్ష చేపట్టిన శ్రీవారి భక్తుడు ఎన్. నరసింహారావు..తమిళనాడులో టీటీడీ ఆస్తుల అమ్మకాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. శ్రీవారి ఆస్తులను విక్రయించాలన్న టీటీడీ నిర్ణయాలతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆయన ఆరోపించారు. ఆస్తులను అమ్మే హక్కు టీటీడీకి లేదని, టీటీడీ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే శ్రీవారి భక్తులను కలుపుకుని పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు.

మరోవైపు టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆదివారం లేఖ రాశారు. తక్షణమే తమిళనాడు, రిషికేష్‌లోని టీటీడీ ఆస్తుల వేలాన్ని ఆపాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. ‘‘ ప్రపంచమంతా కరోనాతో గగ్గోలు పెడుతుంటే మీరు హడావిడిగా టీటీడీ ఆస్తులను విక్రయించటం సరైంది కాదు. రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్లుగా టీటీడీ బోర్డు వైఖరి ఉంది. మీరు, మీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ను అమ్మేందుకు సిద్ధమైనట్లు ఉన్నది. దాతల ద్వారా టీటీడీకి సమకూరిన ఆస్తులను వేలం వేయడం తగదు.. ఇంత అర్థంతరంగా ఆస్తులను అమ్మాల్సిన అవసరం ఏమొచ్చింది? ’’ అని రామకృష్ణ తన లేఖలో పేర్కొన్నారు.

ఇంకోవైపు బీజేపీ నేతలు కన్నా లక్ష్మీనారాయణ, భానుప్రకాశ్ రెడ్డిలు టీటీడీ నిర్ణయాన్ని తప్పుపట్టారు. భూముల వేలాన్ని వెంటనే నిలిపి వేయాలని వారు డిమాండ్ చేశారు. టీటీడీ ధార్మిక క్షేత్రమని, దాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చవద్దని వారు వ్యాఖ్యానించారు. హిందూ దేవాలయాల ఆస్తులను విక్రయిస్తున్న ముఖ్యమంత్రి జగన్.. ఇతర మతాలకు చెందిన సంస్థల భూములను విక్రయించగలరా అని బీజేపీ నేతలు ప్రశ్నించారు. టీటీడీ ఆస్తుల జోలికి వస్తే ఊరుకోమని కన్నా లక్ష్మీనారాయణ హెచ్చరించారు.

అయితే, టీటీడీ ఆస్తుల వేలాన్ని రాజకీయం చేయవద్దని బోర్డు ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి విఙ్ఞప్తి చేస్తున్నారు. 1974 నుంచి ఆస్తుల వేలం కొనసాగుతోందని, కేవలం నిరర్ధక ఆస్తులను మాత్రమే వేలం వేస్తున్నామని ఆయన వివరణ ఇచ్చారు. ఏపీ, తమిళనాడులో ప్రస్తుతం వేలం వేస్తున్న ఆస్తుల్లో 50 శాతం నిరర్ధకమైనవేనని ఆయన చెబుతున్నారు. 50 టీటీడీ ఆస్తుల వేలానికి బోర్డు ఆమోదం తెలిపిందని ఆయనంటున్నారు.

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!