కామారెడ్డి బాలుడు క్షేమం..కిడ్నాపర్లను పట్టుకున్న పోలీసులు

కామారెడ్డి జిల్లాలో ఓ బాలుడి కిడ్నాప్‌ కేసును ఛేదించారు పోలీసులు. భిక్కనూర్‌ మండలం జంగంపల్లి చెక్‌పోస్ట్‌ వద్ద గత నెల 31న మహారాష్ట్ర దంపతుల రెండు నెలల బాబును.......

కామారెడ్డి బాలుడు క్షేమం..కిడ్నాపర్లను పట్టుకున్న పోలీసులు
Follow us

|

Updated on: Aug 04, 2020 | 7:59 PM

కామారెడ్డి జిల్లాలో ఓ బాలుడి కిడ్నాప్‌ కేసును ఛేదించారు పోలీసులు. భిక్కనూర్‌ మండలం జంగంపల్లి చెక్‌పోస్ట్‌ వద్ద గత నెల 31న మహారాష్ట్ర దంపతుల రెండు నెలల బాబును – గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. పేరెంట్స్‌ ఫిర్యాదుతో రంగంలోని దిగిన పోలీసులు – బృందాలుగా ఏర్పడి మూడు రోజులు గాలించారు.

నిజామాబాద్‌, మెదక్‌, సంగారెడ్డి, సిద్ధిపేట జిల్లాల్లో 10 ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. భిక్కనూర్‌ టోల్‌ప్లాజా వద్ద అనుమానాస్పదంగా ఉన్న ఆటోను గుర్తించారు. అందులో ఉన్న వ్యక్తులను విచారించగా… తామే కిడ్నాప్‌ చేశామని ఒప్పుకున్నారు. సంగారెడ్డిలో పద్మ అనే మహిళ ఇంట్లో చిన్నారిని దాచినట్లు తెలిపారు.

బాబును ఎత్తుకెళ్లిన నలుగురిని అరెస్ట్‌ చేసి, జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. ఆ నలుగురు వ్యక్తులు గ్రూప్‌గా ఏర్పడి చిన్నారిని అమ్మేందుకు ప్రయత్నించారని పోలీసులు చెప్పారు. తమ చిన్నారిని క్షేమంగా అప్పగించిన పోలీసులకు – తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.