లాక్డౌన్ వేళ.. గుజరాత్లో పోలీసులపై రాళ్ల దాడి..
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్రంగా వ్యాప్తిచెందుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో లాక్డౌన్ను కేంద్ర ప్రభుత్వం మరింత పొడిగించిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో కరోనా కేసులు పెరుగుతున్న ప్రాంతాల్లో లాక్డౌన్ అమలు మరింత కఠినతరం చేస్తున్నాయి ప్రభుత్వాలు. ఈ క్రమంలో పలుచోట్ల స్థానికులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంటుంది. తాజాగా.. గుజరాత్లోని అహ్మదాబాద్లోని షాపూర్ ప్రాంతంలో స్థానికులకు పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. స్థానికులు పోలీసులపైకి రాళ్లురువ్వుతూ ఆందోళనకు దిగారు. ఈ […]
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్రంగా వ్యాప్తిచెందుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో లాక్డౌన్ను కేంద్ర ప్రభుత్వం మరింత పొడిగించిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో కరోనా కేసులు పెరుగుతున్న ప్రాంతాల్లో లాక్డౌన్ అమలు మరింత కఠినతరం చేస్తున్నాయి ప్రభుత్వాలు. ఈ క్రమంలో పలుచోట్ల స్థానికులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంటుంది. తాజాగా.. గుజరాత్లోని అహ్మదాబాద్లోని షాపూర్ ప్రాంతంలో స్థానికులకు పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. స్థానికులు పోలీసులపైకి రాళ్లురువ్వుతూ ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు నచ్చజేప్పేందుకు ప్రయత్నించినప్పటికీ.. పరిస్థితులు అదుపులోకి రాకపోవడంతో.. పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి.. ఆందోళనకారులను చెదరగొట్టారు. ఈ ఘటనలో ఓ పోలీసుకు గాయాలయ్యాయి. ఘటనకు సంబంధించి ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాగా.. అహ్మదాబాద్ ప్రాంతంలో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో.. లాక్డౌన్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని పోలీసులు ఆదేశిస్తున్నారు. అధికారులు కేవలం నిత్యవసరాల దుకాణాలను, మెడికల్ షాపులను తప్పించి మిగతావాటన్నింటిని మూసేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు.