అర్ధరాత్రి ఒంటరిగా నడుస్తున్న వ్యక్తిని ఆపిన పోలీసులకు షాక్
గురుగ్రామ్: న్యూఢిల్లీలోని గురుగ్రామ్లో అర్ధరాత్రి పూట ఓ వ్యక్తి ఒంటరిగా నడుచుకుంటూ వెళుతున్నాడు. అతన్ని గమనించిన పోలీసులు అనుమానంతో ఆపారు. ఎక్కడికి వెళుతున్నావని అడగ్గానే విషయం తెలుసుకుని షాకయ్యారు. అసలేం జరిగిందంటే.. గురుగ్రామ్కు చెందిన 27 ఏళ్ల కబీర్ అలీ సెక్టార్ 29లోని ది ప్లాజియోలో మేనేజర్గా పని చేస్తున్నాడు. రోజూలానే డ్యూటీకి వెళుతూ ఇంకా కొద్దిదూరం ఉందనగా ఆగి సిగరెట్ తాగుతున్నాడు. ఆ ప్రాంతంలో స్ట్రీట్ లైట్స్ కూడా లేవు. ఇంతలో ఇద్దరు వ్యక్తులు వచ్చి […]
గురుగ్రామ్: న్యూఢిల్లీలోని గురుగ్రామ్లో అర్ధరాత్రి పూట ఓ వ్యక్తి ఒంటరిగా నడుచుకుంటూ వెళుతున్నాడు. అతన్ని గమనించిన పోలీసులు అనుమానంతో ఆపారు. ఎక్కడికి వెళుతున్నావని అడగ్గానే విషయం తెలుసుకుని షాకయ్యారు. అసలేం జరిగిందంటే.. గురుగ్రామ్కు చెందిన 27 ఏళ్ల కబీర్ అలీ సెక్టార్ 29లోని ది ప్లాజియోలో మేనేజర్గా పని చేస్తున్నాడు.
రోజూలానే డ్యూటీకి వెళుతూ ఇంకా కొద్దిదూరం ఉందనగా ఆగి సిగరెట్ తాగుతున్నాడు. ఆ ప్రాంతంలో స్ట్రీట్ లైట్స్ కూడా లేవు. ఇంతలో ఇద్దరు వ్యక్తులు వచ్చి అతనిపై దాడి చేశారు. కారులో ఎక్కించుకుని నగరమంతా తిప్పారు. ఒకతని దగ్గర పిస్టోల్ కూడా ఉంది. ఏటిఎం కార్డులు, క్యాష్ కూడా తీసుకున్నారు. సుమారు ఐదు గంటల పాటు నగరమంతా తిప్పిన తర్వాత, ఏటిఎంలో డబ్బులు కూడా లేవని తెలుసుకున్న అనంతరం కబీర్ అలీని ఒక ప్లేస్లో వదిలిపెట్టి కారుతో ఉడాయించారు.
కారు ధర సుమారు రూ. 8 లక్షల వరకూ ఉంటుంది. దీంతో కబీర్ తన ఆఫీస్ వైపుగా నడుకుంటూ వెళుతున్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేయాలని భావిస్తుండగా అర్ధరాత్రిపూట రోడ్డుపై ఒంటరిగా నడుస్తున్న అతన్ని పోలీసులు విచారించారు. విషయం తెలుసుకుని షాకయ్యారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.