ఏపీలో కల్తీ కూల్ డ్రింక్లు.. తస్మాత్ జాగ్రత్త !
ఇప్పుడు సమాజం అంతా కల్తీ మయం అయిపోయింది. తినే ఆహారాన్ని, వినియోగించే ప్రతి వస్తువును కల్తీ చేస్తున్నారు కేటుగాళ్లు.
ఇప్పుడు సమాజం అంతా కల్తీ మయం అయిపోయింది. తినే ఆహారాన్ని, వినియోగించే ప్రతి వస్తువును కల్తీ చేస్తున్నారు కేటుగాళ్లు. ఇప్పుడు మార్కెట్లో కల్తీ కూల్ డ్రింకుల ట్రెండ్ నడుస్తోంది. తాజాగా కల్తీ కూల్ డ్రింకులు తయారు చేస్తూ మార్కెట్లోకి సరఫరాా చేస్తోన్న ముఠా ఆటకట్టించారు పోలీసులు. తెనాలి వద్ద అంగలకుదురుకు చెందిన వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ తో పోలీసులు ఓ ఇంటిపై దాడి చేశారు. వివిధ బ్రాండ్లకు చెందిన కూల్ డ్రింక్స్ నకిలీవి తయారు చేస్తున్నట్లు గుర్తించారు. తయారీకి వినియోస్తున్న కెమికల్స్, మెషీన్స్ స్వాధీనం చేసుకుని ఇంటిని సీజ్ చేశారు.
విజయవాడకు చెందిన శ్రీమన్నారాయణ అనే వ్యక్తి టిప్పర్ల వీధిలో ఇల్లు అద్దెకు తీసుకుని కల్తీ కూల్ డ్రింక్లు తయారు చేస్తున్నారని తెలిసింది. సుగంధ ప్రెష్ అనే రిజిస్ట్టర్డ్ బ్రాండ్తో తాము శీతల పానీయాలు మార్కెటింగ్ చేస్తున్నామని, తమ బ్రాండ్ లేబుల్స్తో నకిలీవి అమ్ముతున్నట్లు సాయిబాబా అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నకిలీ కూల్ డ్రింక్స్ విషయంలో మరికొన్ని అనుమానాలు ఉన్నాయని, విచారణ చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
Also Read : ఏపీలో పెట్రోల్, డీజిల్పై సెస్ విధింపు