వీళ్లేం పోలీసులు.. వాళ్లేం లాయర్లు.. కోర్టు ముందే కుమ్ములాట..!!

ఒకరేమో శాంతి భద్రతలను కాపాడేవారు.. మరోకరేమో న్యాయాన్ని రక్షించేవారు. వీరిద్దరికి ఉండాల్సింది ఓర్పు, సహనం.. కానీ ఆ రెండు లోపించడంతో.. పెద్ద వివాదమే చెలరేగింది. దేశ రాజధాని ఢిల్లీలోని తీస్ హజారా కోర్టు ముందు.. పోలీసులు, న్యాయవాదుల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో కోర్టు ఆవరణలోనే ఇరువురు కుమ్మేసుకున్నారు. అంతేకాదు.. అక్కడే ఉన్న పలు వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో ఓ పోలీస్ వ్యాన్‌ పూర్తిగా దగ్ధమైంది. అయితే ఇరువురి మధ్య ఘర్షణ తలెత్తడానికి కారణం […]

వీళ్లేం పోలీసులు.. వాళ్లేం లాయర్లు.. కోర్టు ముందే కుమ్ములాట..!!
Follow us

| Edited By:

Updated on: Nov 02, 2019 | 5:57 PM

ఒకరేమో శాంతి భద్రతలను కాపాడేవారు.. మరోకరేమో న్యాయాన్ని రక్షించేవారు. వీరిద్దరికి ఉండాల్సింది ఓర్పు, సహనం.. కానీ ఆ రెండు లోపించడంతో.. పెద్ద వివాదమే చెలరేగింది. దేశ రాజధాని ఢిల్లీలోని తీస్ హజారా కోర్టు ముందు.. పోలీసులు, న్యాయవాదుల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో కోర్టు ఆవరణలోనే ఇరువురు కుమ్మేసుకున్నారు. అంతేకాదు.. అక్కడే ఉన్న పలు వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో ఓ పోలీస్ వ్యాన్‌ పూర్తిగా దగ్ధమైంది. అయితే ఇరువురి మధ్య ఘర్షణ తలెత్తడానికి కారణం చూస్తే కంగుతినాల్సిందే. పార్కింగ్ విషయంలో పోలీసులు, లాయర్లకు మధ్య తలెత్తిన వివాదమే.. ఈ ఘటనకు కారణమైనట్లు తెలుస్తోంది. మూడో బెటాలియన్‌కు చెందిన కొందరు పోలీసులు.. తమపై దాడికి దిగడమే కాకుండా.. తమపై కాల్పులు కూడా జరిపారంటూ లాయర్లు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలపై పోలీసు శాఖ ఇంకా స్పందించాల్సి ఉంది. తీస్ హజారా కోర్టు పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. అయితే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.