మధ్యప్రదేశ్ లో జర్నలిస్టుపై పోలీసు కేసు..
మధ్యప్రదేశ్లో 68 ఏళ్ళ జర్నలిస్ట్ ఒకడు రేప్ కేసులో బుక్కయ్యాడు. ప్యారేమియా అనే ఇతడిపైన, ఇతడికి సహకరించిన స్వీటీ అనే యువతి పైన ఖాకీలు కేసు పెట్టారు. ప్యారేమియా పరారీలో ఉండగా.
మధ్యప్రదేశ్లో 68 ఏళ్ళ జర్నలిస్ట్ ఒకడు రేప్ కేసులో బుక్కయ్యాడు. ప్యారేమియా అనే ఇతడిపైన, ఇతడికి సహకరించిన స్వీటీ అనే యువతి పైన ఖాకీలు కేసు పెట్టారు. ప్యారేమియా పరారీలో ఉండగా.. స్వీటీని అరెస్టు చేశారు. వీరిపై ఐపీసీ, పోక్సో వంటి చట్టాలలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు భోపాల్ (సౌత్) పోలీసు సూపరింటెండెంట్ తోట సాయికృష్ణ తెలిపారు. ఈ నెల 11 న నలుగురు బాలికలు, ఒక మహిళ రతీబార్ ప్రాంతంలో మద్యం తాగిన మత్తులో తిరుగుతుండగా వారిని తన బర్త్ డే పార్టీ పేరున తన ఫ్లాట్ కి పిలిచి ప్యారేమియా వారిపై లైంగిక దాడికి పాల్పడినట్టు ఆయన చెప్పారు. బహుశా వారి పేదరికాన్ని ఆసరాగా చేసుకుని ఈ కామాంధుడు ఈ దారుణానికి దిగినట్టు భావిస్తున్నారు. ప్యారేమియా కోసం పోలీసులు గాలిస్తున్నారు.