ఇసుక లారీ అని తనిఖీ చేస్తే.. అందులో…
విజయవాడలో భారీ ఎత్తున గంజాయిని సీజ్ చేశారు అధికారులు. ఎవరికీ అనుమానం రాకుండా.. ఇసుక లోడ్లో గంజాయి పెట్టి రవాణా చేస్తోంది స్మగ్లింగ్ ముఠా. దీనిపై పక్కాగా సమాచారం అందుకున్న రెవిన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు.. లారీని తనిఖీ చేశారు. ఇసుక లోపల గంజాయి సంచులను గుర్తించారు. మొత్తం 1100 కిలోలకు పైగా ఉందని. .దీని విలువ రూ.2 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు తెలిపారు. నర్సీపట్నం ఏజెన్సీ నుంచి హైదరబాద్కు రవాణా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. లారీని […]
విజయవాడలో భారీ ఎత్తున గంజాయిని సీజ్ చేశారు అధికారులు. ఎవరికీ అనుమానం రాకుండా.. ఇసుక లోడ్లో గంజాయి పెట్టి రవాణా చేస్తోంది స్మగ్లింగ్ ముఠా. దీనిపై పక్కాగా సమాచారం అందుకున్న రెవిన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు.. లారీని తనిఖీ చేశారు. ఇసుక లోపల గంజాయి సంచులను గుర్తించారు. మొత్తం 1100 కిలోలకు పైగా ఉందని. .దీని విలువ రూ.2 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు తెలిపారు. నర్సీపట్నం ఏజెన్సీ నుంచి హైదరబాద్కు రవాణా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. లారీని సీజ్ చేసిన అధికారులు.. డ్రైవర్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. భారీ మొత్తంలో గంజాయి పట్టుబడటంతో దీని వెనుకున్న పెద్ద బడా స్మగ్లర్లు ఎవరన్నదానిపై ఆరా తీస్తున్నారు.
కొద్ది రోజులుగా విశాఖ ఏజెన్సీ నుంచి భారీ ఎత్తున గంజాయిని తరలిస్తున్నాయి స్మగ్లింగ్ ముఠాలు. ఈ క్రమంలో అక్కడ వాహనాలను తనిఖీలు చేస్తున్న అధికారులు.. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో రూట్ మార్చిన ముఠా.. ఇసుకలో లోడ్లో తరలిస్తూ దొరికారు.