ఇలాగైతే పోలవరం ఖర్చు పెరుగుతుంది : కేంద్ర మంత్రి
ఏపీ ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో గత ప్రభుత్వం జరిపిన టెండర్ల రద్దుపై కేంద్రం ఘాటుగా స్పందించింది. ఏపీ ప్రభుత్వం ఈ విధంగా టెండర్లు రద్దు చేయడం విచారకరమన్నారు కేంద్ర జల్శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో ప్రాజెక్టు వ్యయం కూడా పెరుగుతుందన్నారు. శుక్రవారం లోక్సభలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. పోలవరం పూర్తిచేసే బాధ్యత రాష్ర్ట ప్రభుత్వానిదే.. ప్రాజెక్టులో టెండర్ను మరోసారి రద్దు చేయడం బాధకరమని […]
ఏపీ ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో గత ప్రభుత్వం జరిపిన టెండర్ల రద్దుపై కేంద్రం ఘాటుగా స్పందించింది. ఏపీ ప్రభుత్వం ఈ విధంగా టెండర్లు రద్దు చేయడం విచారకరమన్నారు కేంద్ర జల్శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో ప్రాజెక్టు వ్యయం కూడా పెరుగుతుందన్నారు. శుక్రవారం లోక్సభలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. పోలవరం పూర్తిచేసే బాధ్యత రాష్ర్ట ప్రభుత్వానిదే.. ప్రాజెక్టులో టెండర్ను మరోసారి రద్దు చేయడం బాధకరమని మంత్రి వ్యఖ్యానించారు. దీనివల్ల ఖచ్చితంగా నిర్మాణ వ్యయం పెరుగుతుందన్నారు.ఇదిలా ఉంటే పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించామని, ఇప్పటివరకు దానిపై ఖర్చు చేసిన మొత్తం తిరిగి చెల్లించే విషయంలో కొన్ని ఆర్ధికాంశాలపై అభ్యంతరాలున్నాయని తెలిపారు. ఖర్చుపెట్టిన దానికి ఆడిట్ రిపోర్టు సమర్పిస్తే చెల్లింపుల విషయంలో చర్యలు తీసుకుంటామని మంత్రి షెకావత్ లోక్సభకు తెలిపారు.