పాక్ ఆక్రమిత కశ్మీర్‌ త్వరలోనే మనది కాబోతుందా..?

పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)ను త్వరలోనే స్వాధీనం చేసుకోబుతున్నట్లు కేంద్రం మరోసారి సంకేతాలు ఇచ్చింది. మోదీ రెండో సారి అధికారం చేపట్టాక.. ఇటు దేశంలో.. అటు అంతర్జాతీయ వేదికపై తనదైన ముద్ర వేస్తున్నారు. అనూహ్యమైన నిర్ణయాలు తీసుకుంటూ.. తన మార్క్‌ రాజకీయాన్ని ప్రదర్శిస్తున్నారు. తొలిసారి జరిగిని పార్లమెంట్ సమావేశాల్లోనే కీలకమైన బిల్లులను ప్రవేశపెట్టడమే కాకుండా.. ఆ బిల్లును పెద్దల సభలో కూడా పాస్ చేయించేలా ప్లాన్లు వేసి సక్సెస్ అయ్యారు. అందులో భాగంగా జమ్ముకశ్మీర్‌ రాష్ట్రానికి ఉన్న […]

పాక్ ఆక్రమిత కశ్మీర్‌ త్వరలోనే మనది కాబోతుందా..?
Follow us

| Edited By:

Updated on: Sep 18, 2019 | 3:28 AM

పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)ను త్వరలోనే స్వాధీనం చేసుకోబుతున్నట్లు కేంద్రం మరోసారి సంకేతాలు ఇచ్చింది. మోదీ రెండో సారి అధికారం చేపట్టాక.. ఇటు దేశంలో.. అటు అంతర్జాతీయ వేదికపై తనదైన ముద్ర వేస్తున్నారు. అనూహ్యమైన నిర్ణయాలు తీసుకుంటూ.. తన మార్క్‌ రాజకీయాన్ని ప్రదర్శిస్తున్నారు. తొలిసారి జరిగిని పార్లమెంట్ సమావేశాల్లోనే కీలకమైన బిల్లులను ప్రవేశపెట్టడమే కాకుండా.. ఆ బిల్లును పెద్దల సభలో కూడా పాస్ చేయించేలా ప్లాన్లు వేసి సక్సెస్ అయ్యారు. అందులో భాగంగా జమ్ముకశ్మీర్‌ రాష్ట్రానికి ఉన్న స్వయంప్రతిపత్తిని తొలిగిస్తూ ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆ సమయంలోనే జమ్ముకశ్మీర్‌ అంశాన్ని ప్రస్తవించడం అంటే.. అందులో పీవోకే కూడా భాగమే అంటూ హోం శాఖ మంత్రి అమిత్ షా అనడంతో ప్రత్యర్థి పాక్ గుండెల్లో రైల్లు పరుగెత్తినట్లైంది. త్వరలో పాక్ ఆక్రమిత కశ్మీర్ను కూడా స్వాధీనం చేసుకుంటామని సంకేతాలను పరోక్షంగానే ఇచ్చారు. అయితే ఆ తర్వాత.. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా పాక్‌తో చర్చలు అంటే అవి పీవోకే విషయంలోనే అంటూ ఘాటుగా స్పందించారు. అనంతరం మరికొంత మంది బీజేపీ నేతలు కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.

అయితే తాజాగా మరో కేంద్ర మంత్రి కూడా ఇవే వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ రెండోసారి అధికారం చేపట్టి 100 రోజులు పూర్తయిన సందర్భంగా.. మంగళవారం విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ పాక్ ఆక్రమిత కశ్మీరు భారత దేశానిదేనని చెప్తూ, ఏదో ఓ రోజు దానిపై భౌతిక అధికారాన్ని భారత్ సాధిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. పాకిస్థాన్‌తో చర్చలు జరిగితే, అవి పాక్ ఆక్రమిత కశ్మీరుపైనే జరుగుతాయని పేర్కొన్నారు. భారత రాజ్యాంగంలోని అధికరణ 370 పూర్తిగా భారత దేశ అంతర్గత వ్యవహారమని చెప్పారు.

ఇరుగు పొరుగు దేశాలతో భారత్ ఎప్పుడూ సత్సంబంధాలనే కోరుకుంటోందన్న ఆయన.. ఓ పొరుగు దేశం అంతర్జాతీయ ఉగ్రవాద కేంద్రంగా మారిందంటూ పరోక్షంగా పాకిస్థాన్ గురించి ప్రస్తావించారు. ఆ దేశం ఉగ్రవాదంపై పోరాడాలని.. ఆ దేశం నుంచి ఉగ్రవాదం భారత్‌కు ప్రత్యేక సవాల్ గా మారిందన్నారు. సరిహద్దులను దాటే ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకోవాలని పరోక్షంగా పాక్‌కు సూచించారు. ఐక్యరాజ్య సమితి సాధారణ సభ సమావేశాల సందర్భంగా పాకిస్థాన్ విదేశాంగ మంత్రితో మాట్లాడే అవకాశం వస్తే ఏం జరుగుతుందో వేచి చూద్దామని చెప్పారు.

అయితే గత వారమే ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ చేసిన వ్యాఖ్యలు.. కేంద్ర మంత్రులు చేసిన వ్యాఖ్యలు గమనిస్తే.. ఇక త్వరలోనే పీవోకే భారత్‌లో కలవబోతుందని అర్థమవుతుంది. మేము కేవలం కేంద్రం నిర్ణయం, ఆదేశాల కోసం వేచి చూస్తున్నామని.. కేంద్రం ఆదేశిస్తే.. పీవోకేను స్వాధీనం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నమంటూ బిపిన్ రావత్ వ్యాఖ్యలు చేశారు. దీన్ని బట్టి చూస్తే.. త్వరలోనే.. భారత్ పీవోకేను స్వాధీనం చేసుకునేందుకు ఆర్మీకి ఆదేశాలు ఇస్తుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. మరి కొద్ది రోజులు వేచి చూస్తే.. ఏం జరుగుతుందో తెలుస్తుంది. అటు పాక్ కూడా అక్టోబర్‌లో భారత్‌తో యుద్ధం చేయబోతున్నామని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే పాక్‌కు గట్టిగా బుద్ధి చెప్పేందుకు పీవోకేపై టార్గెట్ పెట్టి.. పాక్‌కు కేంద్రం షాక్ ఇవ్వబోతుందా అన్న వార్తలు వస్తున్నాయి.

ఈ పండ్లు తినగానే నీళ్లు తాగుతున్నారా.? ఏమవుతుందో తెలుసా?
ఈ పండ్లు తినగానే నీళ్లు తాగుతున్నారా.? ఏమవుతుందో తెలుసా?
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
హైదరాబాద్‎లో కూల్ కూల్.. తెలంగాణకు వర్ష సూచన..
హైదరాబాద్‎లో కూల్ కూల్.. తెలంగాణకు వర్ష సూచన..
రైల్వేస్టేషన్‌ బయట అమ్ముతున్న నిమ్మకాయ నీళ్లు తాగుతున్నారా..?
రైల్వేస్టేషన్‌ బయట అమ్ముతున్న నిమ్మకాయ నీళ్లు తాగుతున్నారా..?
ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ ఉపయోగించే వారికి గూగుల్ గుడ్‌ న్యూస్‌..
ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ ఉపయోగించే వారికి గూగుల్ గుడ్‌ న్యూస్‌..
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
తెలంగాణలో కొనసాగుతున్న నామినేషన్ల పర్వం.. దాఖలుకు సిద్దమైన నేతలు
తెలంగాణలో కొనసాగుతున్న నామినేషన్ల పర్వం.. దాఖలుకు సిద్దమైన నేతలు
ధోని రికార్డ్‌నే మడతెట్టేసిన కేఎల్‌ఆర్..
ధోని రికార్డ్‌నే మడతెట్టేసిన కేఎల్‌ఆర్..
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య
ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.