తమిళ తీరంలో విషపూరిత తేలు చేపలు..!

రామనాథపురం జిల్లా సేతుకరై సముద్రతీరంలో అరుదైన విషపూరిత తేలు చేపలు వెలుగులోకి వచ్చాయి. మన్నార్ గల్ఫ్ ప్రాంతంలో ఈ అరుదైన సముద్ర జలచరాలు.

తమిళ తీరంలో విషపూరిత తేలు చేపలు..!
Follow us

|

Updated on: Jun 03, 2020 | 3:03 PM

రామనాథపురం జిల్లా సేతుకరై సముద్రతీరంలో అరుదైన విషపూరిత తేలు చేపలు వెలుగులోకి వచ్చాయి. మన్నార్ గల్ఫ్ ప్రాంతంలో ఈ అరుదైన సముద్ర జలచరాలు జీవిస్తున్నాయి. ప్రపంచంలో వేరెక్కడా లేని విధంగా చేపలు, సముద్రపు పశువులతో సహా నాలుగువేలకు పైగా అరుదైన జలచరాలు జీవిస్తున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. దీంతో ఈ ప్రాంతాన్ని జాతీయ పార్కుగా ప్రకటించి పర్యవేక్షణ జరుపుతున్నారు. తాజాగా కేంద్ర మత్స్యశాఖ పరిశోధన సీనియర్ సైంటిస్టు జయభాస్కరన్ ఆధ్వర్యంలో పరిశోధక బృందం మన్నార్ గల్ఫ్ ప్రాంతంలో పరిశీలనలు జరిపారు. తిరుపుల్లాని సమీపంలోని సేతుకరై సముద్ర ప్రాంతంలో మృతి చెందిన స్థితిలో తేలు చేపలు కనిపించాయి. వీటిని పరిశోధనల నిమిత్తం వెలికి తీశారు. ఇవి తరచుగా రంగులు మార్చే చేపలుగా జయభాస్కరన్ పేర్కొన్నారు. ఇవి మనిషిని కుట్టిన, ఈ చేపలను ఆరగించిన శరీరంలోకి విషం వ్యాపించి ప్రాణాలు కోల్పోయే ప్రమాదమున్నట్లు తెలిపారు. అసలు ఈ చేపల జీవన స్థితిపై పూర్తి స్థాయి పరిశోధనలు చేస్తున్నట్లు సీనియర్ సైంటిస్టు జయభాస్కరన్ తెలిపారు.