నేడు జాతీయ యుద్ధ స్మారకాన్ని ఆవిష్కరించనున్న ప్రధాని మోదీ
న్యూఢిల్లి : దేశ రక్షణలో అసువులుబాసిన అమరవీరుల కోసం ఢిల్లీలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన జాతీయ యుద్ధ స్మారకాన్ని ప్రధాని మోదీ ఇవాళ ప్రారంభించనున్నారు. ప్రత్యేకంగా రూపొందిన ఒక రాతి స్తంభం కింది భాగంలో ఏర్పాటు చేసిన వేదికలో జ్వాలను వెలిగిస్తారు. ఈ జ్వాల నిరంతరంగా కొనసాగుతుంది. స్వాతంత్య్రం వచ్చాక దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికుల పట్ల దేశం చూపుతున్న కృతజ్ఞతకు ఇది నిదర్శనమని సమీకృత రక్షణ బలగాల అధిపతి లెఫ్టినెంట్ జనరల్ పి.ఎస్.రాజేశ్వర్ తెలిపారు. ఢిల్లీలోని […]
న్యూఢిల్లి : దేశ రక్షణలో అసువులుబాసిన అమరవీరుల కోసం ఢిల్లీలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన జాతీయ యుద్ధ స్మారకాన్ని ప్రధాని మోదీ ఇవాళ ప్రారంభించనున్నారు. ప్రత్యేకంగా రూపొందిన ఒక రాతి స్తంభం కింది భాగంలో ఏర్పాటు చేసిన వేదికలో జ్వాలను వెలిగిస్తారు. ఈ జ్వాల నిరంతరంగా కొనసాగుతుంది. స్వాతంత్య్రం వచ్చాక దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికుల పట్ల దేశం చూపుతున్న కృతజ్ఞతకు ఇది నిదర్శనమని సమీకృత రక్షణ బలగాల అధిపతి లెఫ్టినెంట్ జనరల్ పి.ఎస్.రాజేశ్వర్ తెలిపారు.
ఢిల్లీలోని ‘ఇండియా గేట్ ప్రాంగణంలోని 40 ఎకరాల్లో దీన్ని నిర్మించారు. చక్రవ్యూహం స్ఫూర్తితో రూపొందిన ఈ స్మారకాన్ని రూ.176 కోట్లతో నిర్మించారు. అంతర్జాతీయ స్థాయిలో దీని డిజైన్ను ఎంపిక చేశారు. సువిశాలమైన ఈ ప్రాంగణంలోని మధ్యభాగం కిందకి దిగి ఉంటుంది. చారిత్రక ఇండియా గేట్ ఘన వారసత్వాన్ని గౌరవించేందుకు ఈ చర్య చేపట్టారు. ఇందులోని 16 గోడలపై 25,942 మంది అమరవీరుల పేర్లు, వారి హోదా, రెజిమెంట్ వివరాలు ఉంటాయి. గ్రానైట్ రాతిపై ఇవి కనిపిస్తాయి. నాలుగు వృత్తాలు ఉంటాయి. వాటికి అమర్ చక్ర, వీరతా చక్ర, త్యాగ్ చక్ర, రక్షక్ చక్రగా పేర్లు పెట్టారు. మధ్యలో ఉండే పొడవైన స్తంభంపై అశోకుడి మూడు సింహాల చిహ్నం ఉంటుంది. పరమయోధ స్థల్ అనే చోట దేశ అత్యున్నత సైనిక పురస్కారం ‘పరమ్వీర్ చక్ర’ పొందిన 21 మంది విగ్రహాలు ఉంటాయి.