సీఎం జగన్‌పై ప్రధాని మోదీ సోదరుడి ప్రశంసలు…

ఏపీ సీఎం జగన్‌ను ప్రధాని మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ ప్రశంసించారు. పశ్చిమ గోదావరి జిల్లా.. ద్వారకా తిరుమలలో జరిగిన దేవతిలకుల, గాండ్ల, తెలకుల సంఘ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఆయన.. జగన్ ప్రజల కష్టాలు తెలిసిన మనిషని, ప్రతిక్షణం పేదల సంక్షేమానికి పాటు పడుతున్నాడని కితాబిచ్చారు. త్వరలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని కలిసి దేవతిలకుల సమస్యలను పరిష్కారించాలని కోరుతానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో తెలకులు,  దేవతిలకులు, గాండ్ల  పద్నాలుగు లక్షల వరకు ఉన్నారని..అన్ని రంగాల్లో ముందుకు వచ్చేందుకు ఒకరికి..ఒకరు […]

సీఎం జగన్‌పై ప్రధాని మోదీ సోదరుడి ప్రశంసలు...
Follow us

|

Updated on: Jan 06, 2020 | 3:07 PM

ఏపీ సీఎం జగన్‌ను ప్రధాని మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ ప్రశంసించారు. పశ్చిమ గోదావరి జిల్లా.. ద్వారకా తిరుమలలో జరిగిన దేవతిలకుల, గాండ్ల, తెలకుల సంఘ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఆయన.. జగన్ ప్రజల కష్టాలు తెలిసిన మనిషని, ప్రతిక్షణం పేదల సంక్షేమానికి పాటు పడుతున్నాడని కితాబిచ్చారు. త్వరలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని కలిసి దేవతిలకుల సమస్యలను పరిష్కారించాలని కోరుతానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో తెలకులు,  దేవతిలకులు, గాండ్ల  పద్నాలుగు లక్షల వరకు ఉన్నారని..అన్ని రంగాల్లో ముందుకు వచ్చేందుకు ఒకరికి..ఒకరు సహరించుకోవాలన్నారు. కష్టపడితే విజయం సాధిస్తామనడానికి ప్రత్యక్ష ఉదాహారణ మోదీయే అని పేర్కొన్నారు. ఇక నేడు బెజవాడ దుర్గమ్మ దర్శనం చేసుకున్నారు ప్రహ్లాద్ మోదీ. ఆలయ ఆధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికి దగ్గరుండి దర్శనం చేయించారు. వేదపండితులు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందించారు.