కరోనాపై సమీక్ష.. రేపు 9 రాష్ట్రాల సీఎంలతో ప్రధాని సమావేశం.!
కరోనా వైరస్ స్థితిగతులను తెలుసుకునేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు తొమ్మిది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.
PM Modi To Hold Meeting With CMs Of Nine States: కరోనా వైరస్ స్థితిగతులను తెలుసుకునేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు తొమ్మిది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్, బీహార్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల సీఎంలు, చీఫ్ సెక్రటరీలతో మంగళవారం ఉదయం 11 గంటలకు సమావేశం కానున్నారు.
ప్రధానితో పాటు కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, డా. హర్షవర్థన్, కిషన్ రెడ్డి, కేబినెట్ సెక్రటరీ, హోం సెక్రటరీ ఈ సమావేశంలో పాల్గొంటారు. కాగా, వరద సహాయక చర్యలపై నేడు ఆరు రాష్ట్రాల సీఎంలతో మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే.
Also Read:
ఎల్ఐసీ పాలసీదారులకు శుభవార్త.. ప్రీమియం చెల్లించని వారికి మరో ఛాన్స్..
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వేలిముద్ర లేకుండా పింఛన్ల పంపిణీ..