విమాన ప్రమాదంపై మోదీ ఆరా
కేరళలో జరిగిన విమాన ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. కేరళ సీఎం పినరయ్ విజయన్కు ఫోన్ చేసి ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలపై..
కేరళలో జరిగిన విమాన ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. కేరళ సీఎం పినరయ్ విజయన్కు ఫోన్ చేసి ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలపై ప్రధాని మోదీకి వివరించారు. కోజికోడ్, మలప్పురం జిల్లా కలెక్టర్లతో పాటుగా.. ఇతర ఉన్నతాధికారులు, ఐజీ అశోక్ యాదవ్ ఎయిర్పోర్ట్కు చేరుకుని సహాయక చర్యలు దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. విమాన ప్రమాదం విషయం ఎంతో బాధకు గురిచేసిందని.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Pained by the plane accident in Kozhikode. My thoughts are with those who lost their loved ones. May the injured recover at the earliest. Spoke to Kerala CM regarding the situation. Authorities are at the spot, providing all assistance to the affected: PM Narendra Modi (File pic) pic.twitter.com/h18CVPEjGH
— ANI (@ANI) August 7, 2020
అటు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కూడా విమాన ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు. గవర్నర్తో మాట్లాడి విషయం తెలుసుకున్నట్లు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెల్పుతూ.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాగా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. కోజికోడ్లో జరిగిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన ప్రమాదం విచారకరమన్నారు. విషయం తెలుసుకుని బాధకు గురైనట్లు తెలిపారు.
Deeply distressed to hear about tragic plane crash of Air India Express flight at Kozhikode, Kerala. Spoke to Kerala Governor Arif Mohammed Khan & inquired about the situation. Thoughts & prayers with affected passengers, crew members & their families: President Ram Nath Kovind pic.twitter.com/yfS8VAosfM
— ANI (@ANI) August 7, 2020
Distressed to learn about the tragic accident of Air India Express aircraft in Kozhikode, Kerala.
Have instructed NDRF to reach the site at the earliest and assist with the rescue operations.
— Amit Shah (@AmitShah) August 7, 2020
Read More :
కర్ణాటకలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు మహారాష్ట్రలో తగ్గని కేసులు.. మళ్లీ 10వేలకు పైగానే