రైతు చట్టాలపై ప్రతిపక్షాల వదంతులు, వారణాసిలో నిప్పులు కక్కిన ప్రధాని మోదీ, ఇవి మేలే చేస్తాయని వ్యాఖ్య
కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలపై విపక్షాలు వదంతులు వ్యాప్తి చెందింపజేస్తున్నాయని ప్రధాని మోదీ ఆరోపించారు. వాటికి రూమర్లే ఆధారమవుతున్నాయన్నారు. సోమవారం వారణాసిని విజిట్ చేసిన ఆయన..
కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలపై విపక్షాలు వదంతులు వ్యాప్తి చెందింపజేస్తున్నాయని ప్రధాని మోదీ ఆరోపించారు. వాటికి రూమర్లే ఆధారమవుతున్నాయన్నారు. సోమవారం వారణాసిని విజిట్ చేసిన ఆయన..ఈ వ్యవసాయ సంస్కరణల వల్ల భవిష్యత్తులో అన్నదాతల ఆదాయం పెరుగుతుందని, వారి జీవనం మరింత వికాసవంతమవుతుందని చెప్పారు. ‘ఇప్పుడు కొత్త ట్రెండ్ కొనసాగుతోంది. లోగడ ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించేవారు..కానీ ఇప్పుడు వారికి (ప్రతిపక్షాలకు) పుకార్లే ప్రాతిపదిక అవుతున్నాయి.ఒక నిర్ణయం సరైనదే అయినా ఊహించని విషయాలే ( తప్పుడు)ప్రచారానికి దోహదపడుతున్నాయి’ అని మోదీ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రైతు చట్టాలపై అదే జరుగుతోందన్నారు.
ఇదివరకటి ప్రభుత్వం చేసిన తప్పిదాల (పాస్ట్ ట్రాక్ రికార్డ్) ఆధారంగా ప్రజల్లో కొన్ని అపోహలు తలెత్తాయని ఆయన అన్నారు. రైతుల కనీస మద్దతుధరను పెంచడం ద్వారా తాము స్వామినాథన్ కమిషన్ నివేదికను అమలు చేశామని, రూ. 49 వేల కోట్లతో ధాన్యాలను కొనుగోలు చేశామని, ఇది గత ప్రభుత్వం కన్నా 75 శాతం ఎక్కువని ప్రధాని తెలిపారు. అలాగే కనీస మద్దతుధరపై దాదాపు 3 రెట్లు ఎక్కువగా గోధుమను కొనుగోలు చేశామన్నారు. విపక్షాలు పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పేరిట తప్పుడు వదంతులు సృష్టిస్తున్నాయన్నారు. నూతన చట్టాలు రైతులకు కొత్త అవకాశాలను, న్యాయపరమైన ప్రయోజనాలను కల్పిస్తాయన్నారు.
వారణాసిలోని హాండియా-రాజతలాబ్ సెక్షన్ లో ఆరు లేన్లతో కూడిన 73 కి.మీ. నేషనల్ హైవే ని మోదీ ప్రారంభించారు. రూ.2,447 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ హైవే వల్ల అలహాబాద్-వారణాసి మధ్య ప్రయాణ కాలం సుమారు గంట తగ్గుతుంది.