‘కరోనా లాక్ డౌన్ కాలంలో’…ప్రధాని మోదీ ఏం చేస్తున్నారంటే ?

కరోనా లాక్ డౌన్ తో ప్రజలంతా ఇళ్లకే పరిమితమైన వేళ.. ప్రధాని మోదీ ఈ టైం లో ఏం చేస్తున్నదీ వివరించారు. అంతర్జాతీయ యోగా డే నాడు తాను యోగా చేస్తున్న దృశ్యాల తాలూకు యానిమేటెడ్ వీడియోను ఆయన విడుదల చేశారు.

'కరోనా లాక్ డౌన్ కాలంలో'...ప్రధాని మోదీ ఏం చేస్తున్నారంటే ?
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Mar 30, 2020 | 1:12 PM

కరోనా లాక్ డౌన్ తో ప్రజలంతా ఇళ్లకే పరిమితమైన వేళ.. ప్రధాని మోదీ ఈ టైం లో ఏం చేస్తున్నదీ వివరించారు. అంతర్జాతీయ యోగా డే నాడు తాను యోగా చేస్తున్న దృశ్యాల తాలూకు యానిమేటెడ్ వీడియోను ఆయన విడుదల చేశారు. తనకు ఈ సమయం చాలా తోడ్పడిందని, ఈ సమయంలో మీరేం చేస్తున్నారని నిన్న తన ‘మన్ కీ బాత్’ కార్యక్రమం సందర్భంగా తనను ప్రశ్నించారని, అందువల్ల ఇలా యోగా చేస్తున్నానంటూ ఇందుకు నిదర్శనంగా ఈ వీడియోను షేర్ చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. మీరు కూడా రెగ్యులర్ గా యోగా చేస్తున్నారనే భావిస్తున్నా.. నేనేమీ ఫిట్ నెస్ ఎక్స్ పర్ట్ గానీ. మెడికల్ నిపుణుడిని గానీ కాను. కానీ ఎన్నో ఏళ్లుగా యోగా నా జీవితంలో ఒక అంతర్భాగమైపోయింది అని ఆయన వివరించారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదని భావిస్తున్నట్టు ట్వీట్ చేశారు. యోగా వీడియోలు వివిధ భాషల్లో లభ్యమవుతున్నాయని, వాటిని చూసి యోగా ప్రాక్టీసు చేయాలని మోదీ అన్నారు.