రేపు ఉదయం 9 గంటలకు.. ప్రధాని మోదీ వీడియో మెసేజ్
శుక్రవారం ఉదయం 9 గంటలకు తాను వీడియో మెసేజ్ ని షేర్ చేస్తానని ప్రధాని మోదీ ప్రకటించారు. ‘నా తోటి కార్మికులకు ఓ చిన్న వీడియో మెసేజ్ ని పోస్ట్ చేస్తున్నా’ అని ఆయన హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ట్వీట్ చేశారు. బహుశా కరోనా వైరస్ సంక్షోభం పైన గానీ, లాక్ డౌన్ పైన గానీ ఆయన ఏదైనా ముఖ్యమైన ప్రకటన చేయవచ్చునని ప్రజలు భావిస్తున్నారు. కరోనా నివారణపై మోదీ జాతినుద్దేశించి రెండు సార్లు ప్రసంగించారు. మొదటి […]
శుక్రవారం ఉదయం 9 గంటలకు తాను వీడియో మెసేజ్ ని షేర్ చేస్తానని ప్రధాని మోదీ ప్రకటించారు. ‘నా తోటి కార్మికులకు ఓ చిన్న వీడియో మెసేజ్ ని పోస్ట్ చేస్తున్నా’ అని ఆయన హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ట్వీట్ చేశారు. బహుశా కరోనా వైరస్ సంక్షోభం పైన గానీ, లాక్ డౌన్ పైన గానీ ఆయన ఏదైనా ముఖ్యమైన ప్రకటన చేయవచ్చునని ప్రజలు భావిస్తున్నారు. కరోనా నివారణపై మోదీ జాతినుద్దేశించి రెండు సార్లు ప్రసంగించారు. మొదటి సారి చేసిన ప్రసంగంలో.. ఒకరోజు జనతా కర్ఫ్యూ గురించి.. రెండో దశ స్పీచ్ లో లాక్ డౌన్ గురించి ప్రకటన చేశారు. లాక్ డౌన్ కాలంలో ప్రజలు సామాజిక దూరాన్ని, లాక్ డౌన్ నిబంధనలను ఖఛ్చితంగా పాటించాలని ఆయన కోరారు.
ఇక గురువారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేసిన ప్రసంగంలో.. లాక్ డౌన్ ఫలితంగా చిక్కుబడిపోయిన ప్రజలను లాక్ డౌన్ ముగిశాక వారి వారి స్వస్థలాలకు సురక్షితంగా పంపే మార్గాలపై ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించాలని మోదీ సూచించారు .
At 9 AM tomorrow morning, I’ll share a small video message with my fellow Indians.
कल सुबह 9 बजे देशवासियों के साथ मैं एक वीडियो संदेश साझा करूंगा।
— Narendra Modi (@narendramodi) April 2, 2020