ఇంటర్నేషనల్ టైగర్స్ డే.. పులుల “స్వర్గధామం ఇండియా”..
కాలం మారుతున్న కొద్దీ మనుషులతో పాటు.. జంతువులు కూడా రక్షణ లేకుండా పోతోంది. సరైనా ఆవాసాలు లేక ప్రతి ఏడాదికి జంతువుల సంఖ్య తగ్గిపోతూ ఉంది. జూలై 29న పులుల అంతర్జాతీయ దినోత్సవంగా కేంద్రప్రభుత్వం ప్రకటించింది. పులుల సంఖ్య తెలుసుకునేందుకు, వాటి వివరాలు సేకరించేందుకు అతి పెద్ద కార్యక్రమం చేపట్టి.. విజయవంతంగా పూర్తి చేశామని మోదీ చెప్పారు. నాలుగేళ్లలో 700 పులులు పెరిగాయన్న మోదీ.. ఇండియా పులులకు అత్యంత ఆవాసయోగ్యంగా ఉందని తెలిపారు. దేశంలో రకరకాల జాతుల […]
కాలం మారుతున్న కొద్దీ మనుషులతో పాటు.. జంతువులు కూడా రక్షణ లేకుండా పోతోంది. సరైనా ఆవాసాలు లేక ప్రతి ఏడాదికి జంతువుల సంఖ్య తగ్గిపోతూ ఉంది. జూలై 29న పులుల అంతర్జాతీయ దినోత్సవంగా కేంద్రప్రభుత్వం ప్రకటించింది. పులుల సంఖ్య తెలుసుకునేందుకు, వాటి వివరాలు సేకరించేందుకు అతి పెద్ద కార్యక్రమం చేపట్టి.. విజయవంతంగా పూర్తి చేశామని మోదీ చెప్పారు. నాలుగేళ్లలో 700 పులులు పెరిగాయన్న మోదీ.. ఇండియా పులులకు అత్యంత ఆవాసయోగ్యంగా ఉందని తెలిపారు. దేశంలో రకరకాల జాతుల పులులు ఉన్నాయి. వాటిని రక్షించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపైనా ఉందన్నారు.
WII ప్రకారం 20వ శతాబ్దం నుంచీ ఇప్పటివరకూ 90 శాతం పులులు అంతరించిపోయాయి. ఆసియాలో పులులను తెగ చంపేస్తున్నారు. వందేళ్ల కిందట ఇదే భూమిపై లక్షకు పైగా పులులు ఉండేవని సమాచారం. ప్రస్తుతం ఇండియాలో 2,967 పులులు ఉన్నాయి. 2014 నుంచి చూసుకుంటే ఇప్పటికి పులుల సంఖ్య 33 శాతం పెరిగింది. ఇక 2022 కల్లా పులుల సంఖ్యను మరింత పెంచాలని కేంద్రప్రభుత్వం యోచిస్తోంది.
2016లో పులులు ఎన్ని ఉన్నాయి. వాటి సంరక్షణ ఎలా జరుగుతోంది తెలుసుకునేందుకు WII సర్వేను కేంద్రప్రభుత్వం చేపట్టింది. అసలు విషయం ఏంటంటే.. పులులు ఎక్కువగా చైనాలోనే చనిపోతున్నాయి. అక్కడ వాటి గోళ్లు, చర్మం వంటివి వేరు చేసి… అంతర్జాతీయ మార్కెట్లలో ఎక్కువ రేట్లకు అమ్మేస్తున్నారు. చైనా మందుల తయారీలో కూడా పులుల్ని వాడుతున్నారు. ఇక వాటి సంఖ్య తగ్గకుండా ఎలా ఉంటుంది. పరిశ్రమలు, ఇళ్లు పెరుగుతున్నాయి. అడవులు తగ్గుతున్నాయి. మరోవైపు వాతావరణ మార్పులు కూడా పులుల సంఖ్య తగ్గడానికి కారణమవుతున్నాయి. కాగా ప్రతి నాలుగేళ్లకొక సారి పులుల సంఖ్యను లెక్కిస్తున్నారు.