PM modi: ఢిల్లీ ఎగ్జిబిషన్‌ ‘హునార్ హాత్’లో ప్రధాని మోదీ సర్‌ప్రైజ్ విజిట్

PM modi: బుధవారం జరిగిన క్యాబినెట్ సమావేశానికి అధ్యక్షత వహించిన వెంటనే, ఢిల్లీలో క్రాఫ్ట్స్ ఫెస్ట్ ‘హునార్ హాత్’ ఎగ్జిబిషన్‌లో ప్రధాని మోదీ సందడి చేశారు. మైనారిటీ వ్యవహారాల మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీతో సహా అందరినీ ప్రధాని నరేంద్ర మోదీ ఆశ్చర్యపరిచారు. కేబినెట్ సమావేశం ముగిసిన వెంటనే నేరుగా అక్కడికి వెళ్లిన ప్రధాని.. స్థానికులకు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఎగ్జిబిషన్‌లో హస్త కళల స్టాల్స్‌ని సందర్శించి వ్యాపారులతో మాట్లాడారు. అనంతరం లిట్టి చోకా తిని మట్టి […]

PM modi: ఢిల్లీ ఎగ్జిబిషన్‌ 'హునార్ హాత్'లో ప్రధాని మోదీ సర్‌ప్రైజ్ విజిట్
Follow us

| Edited By:

Updated on: Feb 19, 2020 | 6:32 PM

PM modi: బుధవారం జరిగిన క్యాబినెట్ సమావేశానికి అధ్యక్షత వహించిన వెంటనే, ఢిల్లీలో క్రాఫ్ట్స్ ఫెస్ట్ ‘హునార్ హాత్’ ఎగ్జిబిషన్‌లో ప్రధాని మోదీ సందడి చేశారు. మైనారిటీ వ్యవహారాల మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీతో సహా అందరినీ ప్రధాని నరేంద్ర మోదీ ఆశ్చర్యపరిచారు. కేబినెట్ సమావేశం ముగిసిన వెంటనే నేరుగా అక్కడికి వెళ్లిన ప్రధాని.. స్థానికులకు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఎగ్జిబిషన్‌లో హస్త కళల స్టాల్స్‌ని సందర్శించి వ్యాపారులతో మాట్లాడారు. అనంతరం లిట్టి చోకా తిని మట్టి కప్పులో చాయ్ తాగారు. కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో ఈ హునార్ హాత్ కార్యక్రమం జరిగింది.

దేశవ్యాప్తంగా మైనారిటీ వర్గాల కళాకారులతో సంభాషించడానికి ప్రధాని ఒక గంటకు పైగా గడిపారు. ఢిల్లీ క్రాఫ్ట్స్ ఫెస్ట్‌లో లిట్టి చోకా తిని రూ.120 చెల్లించారు. అనంతరం మోదీ, ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ కలిసి టీ తాగారు. మట్టి గ్లాసుల్లో ఛాయ్ తాగి రూ.40 చెల్లించారు. ఢిల్లీ క్రాఫ్ట్స్ ఫెస్ట్‌లో సుమారు 50 నిమిషాల పాటు ఉన్నారు మోదీ. అన్ని స్టాల్స్ తిరిగి అక్కడున్న వస్తువులను వీక్షించారు.

[svt-event date=”19/02/2020,6:16PM” class=”svt-cd-green” ]

[/svt-event]