బాలీవుడ్ సెలబ్రిటీస్తో మోదీ భేటీ..ఎందుకంటే?
మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ శనివారం బాలీవుడ్ సెలబ్రిటీస్ను కలిశారు. ఢిల్లీలోని లోక్కల్యాణ్ మార్గ్లో జరిగిన ఈ కార్యక్రమానికి బాలీవుడ్ నటులు అమీర్ఖాన్, షారూక్ ఖాన్, కంగనా రనౌత్ సహా..పలువురు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ.. మహాత్మాగాంధీ సిద్ధాంతాలను విస్తృతం చేయడంలో సినీ, టీవీ పరిశ్రమకు చెందిన కొందరు సభ్యులు గొప్పగా పనిచేస్తున్నారని అన్నారు. అనంతరం గాంధీ సిద్ధాంతాలను, అనుసరించిన మార్గాల గురించి చర్చించారు. అదేవిధంగా ఒకే సారి వాడే ప్లాస్టిక్(సింగిల్ […]
మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ శనివారం బాలీవుడ్ సెలబ్రిటీస్ను కలిశారు. ఢిల్లీలోని లోక్కల్యాణ్ మార్గ్లో జరిగిన ఈ కార్యక్రమానికి బాలీవుడ్ నటులు అమీర్ఖాన్, షారూక్ ఖాన్, కంగనా రనౌత్ సహా..పలువురు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ.. మహాత్మాగాంధీ సిద్ధాంతాలను విస్తృతం చేయడంలో సినీ, టీవీ పరిశ్రమకు చెందిన కొందరు సభ్యులు గొప్పగా పనిచేస్తున్నారని అన్నారు. అనంతరం గాంధీ సిద్ధాంతాలను, అనుసరించిన మార్గాల గురించి చర్చించారు. అదేవిధంగా ఒకే సారి వాడే ప్లాస్టిక్(సింగిల్ యూజ్ ప్లాస్టిక్) నిషేధంపై మద్దతు తెలిపినందుకు నటుడు అమీర్ఖాన్కు ధన్యవాదాలు తెలిపారు.
మహాత్మాగాంధీ సిద్ధాంతాలను ప్రజలకు తెలియజేసే విధంగా ప్రధాని మోదీ చేస్తున్న కృషిని అమీర్ఖాన్ అభినందించారు. ఇందుకోసం సృజనాత్మక వ్యక్తులుగా తాము కూడా చేయాల్సిన దాని కన్నా ఎక్కువగానే కృషి చేస్తామని అమీర్ అన్నారు. గాంధీ సిద్ధాంతాలను ప్రజలకు మళ్లీ పరిచయం చేయాలనే ఉద్దేశంతో అందరినీ ఒకే వేదికపై చేర్చినందుకు ప్రధానికి షారూఖ్ ఖాన్ ధన్యవాదాలు తెలిపారు.
Spreading the thoughts of Mahatma Gandhi through cinema, ensuring more youngsters are well-acquainted with the ideals of Gandhi Ji.
Today’s interaction with leading film personalities and cultural icons was fruitful.
We exchanged thoughts on a wide range of subjects. pic.twitter.com/2xKTEZrVAJ
— Narendra Modi (@narendramodi) October 19, 2019
Our film and entertainment industry is diverse and vibrant.
Its impact internationally is also immense.
Our films, music and dance have become very good ways of connecting people as well as societies.
Here are more pictures from the interaction today. pic.twitter.com/711sKni29l
— Narendra Modi (@narendramodi) October 19, 2019