భారీ ఆధిక్యం దిశగా మోదీ, అమిత్ షా
ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్షా ఓట్ల ఆధిక్యత పరంగా దూసుకుపోతున్నారు. మధ్యాహ్నం 1 గంటల వరకూ వెలువడిన ట్రెండ్స్ ఆధారంగా ప్రధాని మోదీ యూపీలోని వారణాసి నుంచి 2 లక్షల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతుండగా, అమిత్షా గుజరాత్లోని గాంధీనగర్ నుంచి 3 లక్షల ఓట్ల ఆధిక్యంతో సత్తా చాటుతున్నారు. వారణాసి నుంచి పోటీ పడుతున్న కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్, సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి షాలిని యాదవ్ బాగా వెనుకబడ్డారు. గాంధీనగర్ నుంచి అమిత్షాకు […]
ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్షా ఓట్ల ఆధిక్యత పరంగా దూసుకుపోతున్నారు. మధ్యాహ్నం 1 గంటల వరకూ వెలువడిన ట్రెండ్స్ ఆధారంగా ప్రధాని మోదీ యూపీలోని వారణాసి నుంచి 2 లక్షల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతుండగా, అమిత్షా గుజరాత్లోని గాంధీనగర్ నుంచి 3 లక్షల ఓట్ల ఆధిక్యంతో సత్తా చాటుతున్నారు. వారణాసి నుంచి పోటీ పడుతున్న కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్, సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి షాలిని యాదవ్ బాగా వెనుకబడ్డారు. గాంధీనగర్ నుంచి అమిత్షాకు పోటీదారులుగా ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ సీజే చావ్డా, బీఎస్పీ అభ్యర్థి జయేంద్ర రాథోడ్ సైతం ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.