కశ్మీర్‌పై మా తాజా ఆర్డర్..బీ అలర్ట్..సీఎంలకు మోదీ ఫోన్!

ఢిల్లీ: జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని  రద్దు చేస్తూ కేంద్రం సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అలాగే జమ్ము-కశ్మీర్‌ను అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా.. లడఖ్‌ను చట్టసభలేని కేంద్ర పాలిత ప్రాంతంగా విభజించారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ విషయాన్ని రాష్ట్రాల సీఎంలకు స్వయంగా ఫోన్‌ చేసి తెలియజేస్తున్నారు. రాష్ట్రాల్లోని తాజా పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో బిహార్‌, ఉత్తరప్రదేశ్‌, తెలంగాణ సహా దేశంలోని పలు సున్నిత ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అలాగే […]

కశ్మీర్‌పై మా తాజా ఆర్డర్..బీ అలర్ట్..సీఎంలకు మోదీ ఫోన్!
Follow us

|

Updated on: Aug 05, 2019 | 4:22 PM

ఢిల్లీ: జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని  రద్దు చేస్తూ కేంద్రం సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అలాగే జమ్ము-కశ్మీర్‌ను అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా.. లడఖ్‌ను చట్టసభలేని కేంద్ర పాలిత ప్రాంతంగా విభజించారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ విషయాన్ని రాష్ట్రాల సీఎంలకు స్వయంగా ఫోన్‌ చేసి తెలియజేస్తున్నారు. రాష్ట్రాల్లోని తాజా పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో బిహార్‌, ఉత్తరప్రదేశ్‌, తెలంగాణ సహా దేశంలోని పలు సున్నిత ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అలాగే ఈరోజు సాయంత్రం కేంద్ర హోంశాఖ ప్రధాన కార్యదర్శి కశ్మీర్‌కు వెళ్లి పరిస్థితిని సమీక్షించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సున్నిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోంశాఖ రాష్ట్రాలకు సూచించింది. అన్ని రాష్ట్రాలకు అప్రమత్తత హెచ్చరికలు జారీ చేశారు. ఈ తరుణంలో కశ్మీర్‌ లోయకు బలగాల మోహరింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. కశ్మీర్‌ లోయకు వాయుమార్గంలో పారామిలిటరీ బలగాలను తరలించారు.