ఉగ్రవాదంపై పోరులో ఫ్రాన్స్ కి బాసట, ప్రధాని మోదీ
ఫ్రాన్స్ లో జరిగిన ఉగ్రదాడిని ప్రధాని మోడీ తీవ్రంగా ఖండించారు. టెర్రరిజంపై ఆ దేశం జరిపే పోరులో ఆ దేశానికి పూర్తిగా సహకరిస్తామని ఆయన ట్వీట్ చేశారు.
ఫ్రాన్స్ లో జరిగిన ఉగ్రదాడిని ప్రధాని మోడీ తీవ్రంగా ఖండించారు. టెర్రరిజంపై ఆ దేశం జరిపే పోరులో ఆ దేశానికి పూర్తిగా సహకరిస్తామని ఆయన ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. పారిస్ లో గురువారం ఓ చర్చిలో జరిగిన టెర్రరిస్టు ఎటాక్ లో ముగ్గురు మరణించగా పలువురు గాయపడ్డారు. అయితే ఉగ్రవాద బాధిత దేశాల్లో ఇండియా కూడా ఒకటని, ఈ దేశంలో ఎప్పుడు టెర్రరిస్టు ఎటాక్ లు జరిగినా మిత్ర దేశాలు వెంటనే ఈ విధమైన హామీనివ్వలేదని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.