బిగ్ బ్రేకింగ్.. చైనా-భారత్‌ మధ్య ఉద్రిక్తత నేపథ్యంలో 19న అఖిలపక్షం భేటీ

సోమవారం భారత్‌-చైనాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య వాతావరణం హీటెక్కిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇరవై మంది భారత జవాన్లు వీరమరణం పొందరు

బిగ్ బ్రేకింగ్.. చైనా-భారత్‌ మధ్య ఉద్రిక్తత నేపథ్యంలో 19న అఖిలపక్షం భేటీ
Follow us

| Edited By:

Updated on: Jun 17, 2020 | 2:42 PM

సోమవారం భారత్‌-చైనాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య వాతావరణం హీటెక్కిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇరవై మంది భారత జవాన్లు వీరమరణం పొందరు. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ నెల 19న సాయంత్రం 5.00 గంటలకు ఆల్ పార్టీ మీటింగ్‌ నిర్వహించనున్నారు. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీల అధినేతలకు ప్రధాని కార్యాలయం నుంచి ఆహ్వానం పంపారు. అయితే ఈ భేటీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించనున్నారు.

కాగా, సోమవారం జరిగిన ఇరు దేశాల జవాన్ల మధ్య జరిగిన ఘర్షణలో దాదాపు 45 మంది చైనాకు చెందిన జవాన్లు కూడా మరణించారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే దీనిపై ఇప్పటి వరకు చైనా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ తమ వాళ్లు కూడా పెద్ద సంఖ్యలో గాయపడ్డట్లు పేర్కొంది. గత కొద్ది రోజులుగా లడాక్ లోని గల్వాన్ ప్రాంతంలో సరిహద్దు దాటుతూ చైనా కయ్యానికి కాలుదువ్వుతోంది.

ఇక దేశవ్యాప్తంగా చైనా తీరును నిరసిస్తూ.. ఆందోళనలు మిన్నంటుతున్నాయి. పలుచోట్ల చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ దిష్టిబొమ్మలను దహనం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చైనా తీరుపై మండిపడ్డారు. వారికి ఎంత ధైర్యం ఉంటే మన సైనికులను చంపుతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ప్రధాని మోదీ నోరు మెదపాలంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ కూడా శుక్రవారం నాడు సాయంత్రం 5.00 గంటలకు అఖిలపక్ష భేటీకి పిలుపునివ్వడం గమనార్హం.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!