మా జిల్లా ప్రజల్ని ఆదుకోండి..జగన్కు బీజేపీ నేత విజ్ఞప్తి
గత తెలుగుదేశం ప్రభుత్వం మోసం చేసిన పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలను ఆంధ్రప్రదేశ్ నూతన సీఎం వైఎస్ జగన్ ఆదుకోవాలని మాజీ మంత్రి, బీజేపీ నేత పైడికొండల మాణిక్యాలరావు కోరారు. తాడేపల్లి గూడెంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకపోవడంతో జిల్లా యువత వలసబాట పడుతున్నారని, వారిని కొత్త ప్రభుత్వం ఆదుకుని ఉద్యోగ అవకాశాలు కల్పించాలని విన్నవించారు. పూర్తికాని తాడిపూడి, చింతలపూడి ఎత్తిపోతలను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. తాడేపల్లిగూడెంలో అదనపు […]
గత తెలుగుదేశం ప్రభుత్వం మోసం చేసిన పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలను ఆంధ్రప్రదేశ్ నూతన సీఎం వైఎస్ జగన్ ఆదుకోవాలని మాజీ మంత్రి, బీజేపీ నేత పైడికొండల మాణిక్యాలరావు కోరారు. తాడేపల్లి గూడెంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకపోవడంతో జిల్లా యువత వలసబాట పడుతున్నారని, వారిని కొత్త ప్రభుత్వం ఆదుకుని ఉద్యోగ అవకాశాలు కల్పించాలని విన్నవించారు. పూర్తికాని తాడిపూడి, చింతలపూడి ఎత్తిపోతలను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. తాడేపల్లిగూడెంలో అదనపు జిల్లా కోర్టు ఏర్పాటుకు అనుమతినిచ్చిన పాత, కొత్త ప్రభుత్వాలకు ధన్యవాదాలన్నారు. దశలవారీగా మద్యపాన నిషేధం చేస్తానని ఆ దిశగా అడుగులు వేస్తూ బెల్ట్షాపుల రద్దుకు కృషి చేస్తోన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు ధన్యవాదాలు అని చెప్పారు.