ఆ జట్టు గెలిస్తేనే ‘సన్’ నిలుస్తుంది..!
ఐపీఎల్ 12వ సీజన్లో లీగ్ మ్యాచులు మరో రెండు రోజుల్లో ముగియనున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ ఇప్పటికే ప్లేఆఫ్స్కు అర్హత సాధించాయి. మిగిలిన నాలుగో బెర్త్ కోసం నాలుగు జట్ల మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. ఇది ఇలా ఉండగా అన్ని జట్ల కన్నా మెరుగైన రన్రేట్తో ఉన్న సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకే ప్లేఆఫ్ బెర్త్ దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సీజన్లో పలు సార్లు గెలుపు అంచుల వరకు […]
ఐపీఎల్ 12వ సీజన్లో లీగ్ మ్యాచులు మరో రెండు రోజుల్లో ముగియనున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ ఇప్పటికే ప్లేఆఫ్స్కు అర్హత సాధించాయి. మిగిలిన నాలుగో బెర్త్ కోసం నాలుగు జట్ల మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. ఇది ఇలా ఉండగా అన్ని జట్ల కన్నా మెరుగైన రన్రేట్తో ఉన్న సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకే ప్లేఆఫ్ బెర్త్ దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సీజన్లో పలు సార్లు గెలుపు అంచుల వరకు వెళ్లి ఓటమిపాలైన సన్రైజర్స్ తమ జట్టు కూర్పును ఎంచుకోవడంలో విఫలమైందనే చెప్పాలి. బెయిర్స్టో, డేవిడ్ వార్నర్ లాంటి స్టార్ ఆటగాళ్లు కీలకదశలో జట్టుకు అందుబాటులో లేకపోయినా.. వారు ఎప్పుడు వెళ్ళిపోతారన్న విషయం జట్టు యాజమాన్యానికి ముందే తెలిసిన నేపథ్యంలో సరైనా ప్రత్యామ్నాయాలను సిద్ధం చేసుకుని ఉంటే బాగుండేదని విశ్లేషకుల మాట.
ఇకపోతే సన్రైజర్స్ జట్టు లీగ్లో తమ చివరి మ్యాచ్ను ఈరోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుతో తలబడనుంది. కిందటి గణాంకాలను పరిశీలిస్తే ఈ మ్యాచ్కు ఫేవరెట్స్గా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు నిలుస్తుంది. రెండు జట్లు ఆడిన చివరి ఆరు మ్యాచులలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఐదు మ్యాచులలో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక అటు రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ తప్ప మిగిలిన బ్యాట్స్మెన్ ఎవరూ కూడా సరిగ్గా రాణించలేదు. కాబట్టి సన్రైజర్స్ జట్టు సరైనా కూర్పుతో ఈ మ్యాచ్కు బరిలోకి దిగితే.. ఖచ్చితంగా విజయం సాధిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. మరోవైపు సన్రైజర్స్ ఈ మ్యాచ్ గెలిస్తే.. తమకున్న మెరుగైన నెట్ రన్రేట్ ద్వారా ప్లేఆఫ్స్కు సునాయాసంగా వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు విజయం సాధించాలని ఆశిద్దాం.