“పేదల కోసం వ్యవసాయం చేస్తా..కరోనా ఇదే నేర్పించింది”
కరోనావైరస్ ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టింది. ఎన్నో పాఠాలను, చాలా గుణపాఠాలను నేర్పుతోంది. ఈ వైరస్ ప్రభావంతో మనుషుల జీవిన శైలి, ఆలోచనా విధానంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. నేచర్ ని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలో చెప్తుంది.
కరోనావైరస్ ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టింది. ఎన్నో పాఠాలను, చాలా గుణపాఠాలను నేర్పుతోంది. ఈ వైరస్ ప్రభావంతో మనుషుల జీవిన శైలి, ఆలోచనా విధానంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. నేచర్ ని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలో చెప్తుంది. కుటుంబాలు ఎంత విలువైనవి, డబ్బు ఎంత తుచ్చమైనదో బోధిస్తుంది కరోనావైరస్. ఈ క్రమంలో కరోనా కారణంగా తాను నేర్చుకున్న పాఠమేంటో వెల్లడించాడు భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్. ఈ వైరస్ తనలోని మానవత్వాన్ని తట్టిలేపిందని..ఇతరులకు సహాయం చేయడం ఎంత ముఖ్యమో నేర్పించిందని వెల్లడించాడు.
ఈ నేపథ్యంలో కొంత పొలం కొని, పేదల కోసం పంటలు పండించాలని అనుకుంటున్నాని తెలిపాడు. ఇలా సమాజంలోని పేదలకు తన వంతుగా సాయం చేయాలనుకుంటున్నట్లు ప్రకటించాడు . కేవలం డబ్బు సంపాదించడానికే మనిషులు బ్రతకూడదని, ఇతరులకు సాయం చేయడం కూడా ఒక బాధ్యతగా భావించాలని చెప్పాడు. హార్బజన్ నిర్ణయం పట్ల సోషల్ మీడియా నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.