ఘోర ప్రమాదం.. ఇళ్ల మధ్యే కుప్పకూలిన ఫ్లైట్.. 29 మంది మృతి..!
ఆఫ్రికాలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఓ చిన్న విమానం ఇళ్ల మధ్య కుప్పకూలింది. ఈ ఘటనలో దాదాపు 29 మందికి పైగా మరణించగా.. పలువురు గాయపడ్డారు. ప్రమాద సమయంలో విమానంలో 17మంది ప్రయాణికులు, ఇద్దరు పైలెట్లు ఉన్నారని స్థానిక మీడియా పేర్కొంది. కాగా, నివాసాల మధ్య కూలడంతో.. స్థానిక ప్రజలు కూడా మరణించారు. అకస్మాత్తుగా చోటుచేసుకున్న ఈ ఘటన చూసి ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు […]
ఆఫ్రికాలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఓ చిన్న విమానం ఇళ్ల మధ్య కుప్పకూలింది. ఈ ఘటనలో దాదాపు 29 మందికి పైగా మరణించగా.. పలువురు గాయపడ్డారు. ప్రమాద సమయంలో విమానంలో 17మంది ప్రయాణికులు, ఇద్దరు పైలెట్లు ఉన్నారని స్థానిక మీడియా పేర్కొంది. కాగా, నివాసాల మధ్య కూలడంతో.. స్థానిక ప్రజలు కూడా మరణించారు. అకస్మాత్తుగా చోటుచేసుకున్న ఈ ఘటన చూసి ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీం.. ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
కాగా, గోమా ఎయిర్పోర్ట్ నుంచి బెనీ నగరానికి.. “బిజీ బీ” అనే ప్రైవేట్ సంస్థకు చెందిన ఓ విమానం బయల్దేరింది. అయితే టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఈ ఘటన చోటుచేసుకుంది. విమానంలో తలెత్తిన సాంకేతికలోపం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు.